రాత్రి పబ్ లో పార్టీ చేసుకున్నారు.. తెల్లారేసరికి..
By Ravi
On
సికింద్రాబాద్ లోని ఓ AC కంపెనీలో సీనియర్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేస్తున్న హర్షవర్ధన్ స్నేహితులు, తోటి ఉద్యోగులతో కలిసి కొండాపూర్ క్వాక్ పబ్ లో పార్టీకి వచ్చాడు. పబ్ నుంచి గచ్చిబౌలిలోని అపార్ట్మెంట్ కి వచ్చిన హర్షవర్ధన్, స్నేహితలు మళ్లీ అపార్ట్మెంట్ లో మరోసారి మద్యం తాగారు. తెల్లవారుజామున హర్షవర్ధన్ కి వాంతులు కావడంతో అతడిని స్నేహితులు AIG హాస్పిటల్ కి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. విషయం తెలుసుకున్న రాయదుర్గం పోలీసులు అనుమానాస్పద స్థితిలో మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హర్షవర్ధన్ విజయనగరం జిల్లా ప్రసాద్ నగర్ కి చెందిన వాడిగా గుర్తించి అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.
Tags:
Latest News
08 Jun 2025 22:49:51
విజయవాడ నగరపాలక సంస్థ08-06-2025
యోగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాలి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సచివాలయంలో ర్యాలీ జరగాలి