కవిత.. పార్టీ.. జెండా.. అజెండా..సింబల్ ఇదే..
- పార్టీ పేరు జెండా అజెండా రెడీ చేసుకున్న కవిత
- జూన్ లో అమరవీరుల స్థూపం వద్ద ప్రకటన
- కవిత నిర్ణయాలపై కేసిఆర్ తో కేటీఆర్ మంతనాలు
- ఆమె బ్యాక్ గ్రౌండ్ వ్యక్తులపై ఆరా
- కేసీఆర్ వదిలిన బాణమే అంటున్న ప్రతిపక్షాలు
- బీజేపీతో దోస్తాని కోసం పెద్ద స్కెచ్ అంటూ ఆరోపణలు
కల్వకుంట్ల కవిత.. పార్టీ.. జెండా.. అజెండా రెడీ అయ్యింది. అమరవీరుల స్థూపం సాక్షిగా పార్టీ ప్రకటన చేసేందుకు డేట్ ఫిక్స్ చేసింది. జూన్ మొదటి వారంలో పార్టీ పేరు అనౌన్స్ మెంట్ చేసేందుకు చురుకుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనితో చాలా మంది నేతలు కవితను కలుస్తున్నారు. తమ సపోర్ట్ మీకే అంటూ హామీలు గుప్పిస్తున్నారు. జెండా దాని రంగులు పార్టీ సింబల్ దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. తెలంగాణ నినాదాలతోనే ముందుకు పోతే సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందనే ఆలోచనతో అడుగులు వేస్తున్నారు."తెలంగాణ జన జాగృతి" అలాగే "జన జాగృతిపార్టీ" పేరున రెండు రిజిస్ట్రేషన్లు అయ్యాయని కవిత సన్నిహితులు చెబుతున్నారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమయంలో గులాబీ రంగు, అంబాసిడర్ కారు గుర్తు జనాల్లోకి సులువుగా వెళ్లి ప్రతి ఒక్కరి మనసుల్లో ముద్ర వేసుకుంది. ఎన్నికల సమయంలో నిరక్షరాస్యులైన వారు కూడా పార్టీ సింబల్ మర్చిపోకుండా ఓటు వేసే విధంగా అనువుగా ఉండేలా తీర్చిదిద్దారు. అలాగే కవిత పార్టీ సింబల్ కూడా అలానే ఉంటుంది అని చెబుతున్నారు.
కేసిఆర్ కూతురిగా పేరు ఉన్నా.. బతుకమ్మతో కవిత మరింత ఫేమస్ అయ్యింది. అప్పుడే జాగృతి ఆర్గనైజేషన్ పురుడుపోసుకుంది. తెలంగాణలో సెంటిమెంట్ గా ఉండాలి అంటే బతుకమ్మ సింబల్ తోనే ముందుకు వెళ్లాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీ జెండా రంగు లేతనీలిరంగులో ఉండాలి.. ఆకాశమంత పార్టీ ఎదగాలని పలువురు అభిప్రాయాలు పంచుకుంటున్నారు. తెలంగాణ మ్యాప్.. ఓరుగల్లు కోట.. బతుకమ్మ కొట్టొచ్చినట్లు తన పార్టీ జెండాలు కనిపించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ కసరత్తు ఇప్పటిది కాదని, చాలా రోజులుగా లోలోన జరుగుతున్న వ్యవహారాలు ఇప్పుడు బయటపడ్డాయని పలువురు నేతలు అంటున్నారు. అందుకే ఇలాంటి రోజు ఒకటి వస్తుందని కవిత ఎప్పుడో జెండా, అజెండా రెడీ చేసుకున్నారని, టిఆర్ఎస్ నుండి బిఆర్ఎస్ పేరు మారిన క్షణమే కవిత సొంత పార్టీకి రెడీ అయినట్లు సమాచారం. కవితపార్టీ పెడుతోంది అని తెలియగానే ఆమె ఇంటికి పలువురు నేతలు క్యూ కడుతున్నారని సమాచారం. నేతలకు, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పిస్తూ పార్టీలో అడుగులు వేయాలని కవిత పలు నిర్ణయాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆమె లేఖ వ్యవహారంపై కేటీఆర్ సైతం కస్సుబుస్సులాడారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు ఇలా బహిర్గతం చేయడంపై కాస్త కోపంగా వున్నారు. ప్రభుత్వాన్ని ఎలా ఇరకాటంలో పెట్టాలా అని ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్న తరుణంలో సొంత పార్టీ నేత, కేసీఆర్ కూతురే తప్పు బట్టడం, సొంత పార్టీకి ఈ నిర్ణయం మింగుడు పడని వ్యవహారాలా మారింది. దీనిపై తండ్రి కొడుకులు ఓ మీటింగ్ కూడ పెట్టుకున్నారు.
గతంలో తెలంగాణ సెంటిమెంట్ తో టిఆర్ఎస్ కి ప్రజలు రెండు సార్లు అధికారం కట్టబెట్టారు. ఇప్పుడు ఆ సెంటిమెంట్ లేకుండా బిఆర్ఎస్ అనే సరికే పార్టీ ఓటమి చవిచూసిందని కవిత అభిప్రాయం. ఆ నినాదాన్ని తాను ఎత్తుకొని ప్రజల సెంటిమెంట్ కలగలిపి ముందుకు పోవాలని ఆలోచిస్తోంది. పార్టీ వ్యవహారంలో కవిత రాసిన లేఖపై దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఆమెపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పలువురు అధిష్ఠానం వద్ద పట్టుబట్టినట్లు బిఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. ఆమెపై చర్యలు తీసుకోకపోతే కూతురు అని వెనుకేసుకొచ్చినట్లు ప్రచారం జరుగుతుందని అదే జరిగితే భవిష్యత్తు సరే స్థానిక ఎన్నికల్లో గెలవడం కూడా కష్టమే అంటున్నారు నేతలు.
కవిత పార్టీ విషయంపై బీజేపీ, కాంగ్రెస్ నేతలు అంత ఫ్యామిలీ డ్రామా అని ఆరోపణలు చేస్తున్నారు. గతంలో ఎన్నికల సమయంలో మహిళలు, పార్టీల ఓట్లు చీల్చేందుకు కేసీఆర్ వదిలిన బాణం షర్మిల పార్టీ ఏ రేంజ్ లో కొట్టుకుపోయిందో కవిత పార్టీ అంతే అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇది కూడా కేసీఆర్ తమపై వదిలే మరో బాణం అంటూ కొట్టిపారేస్తున్నారు. అంతర్గత, కుటుంబ తగాదాలతో ఆపార్టీ బీటలు వారిందని, పదవుల కోసం గొడవలు చెలరేగడం ఎవరిని సముదాయించిన నష్టం తనకే అని భావించిన కేసీఆర్ విడివిడి పార్టీలకు సై అన్నాడని చెబుతున్నారు. బీజేపీ, కాంగ్రెస్, సొంత బిఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్న పట్టించుకోకుండా కవిత మాత్రం తన పనిలో తాను నిమగ్నమయ్యారని తేలిపోయింది. అయితే కవిత పార్టీ పెట్టె వెనుక కేసిఆర్ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. గత ఎన్నికల్లో మోడీని ఢీకొట్టేందుకు కేసిఆర్ పావులు కదిపాడు. టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా మార్చి పలు రాష్ట్రాల్లో చక్కర్లు కొట్టాడు. అయిన ఆశించినంత రిజల్ట్ రాలేదు. దీనికి తోడు లిక్కర్ స్కాంలో కవిత జైల్ కి వెళ్లింది. ఆ కేసును ఎదుర్కొంటోంది. కేసీఆర్ కి మోడీ దారులు అన్ని మూసుకుని పోయాయి. దీనితో కూతురి పార్టీ అడ్డం పెట్టుకొని చివరి క్షణంలో ఆ రెండు పార్టీలు నావే అంటూ కవిత తో అలైన్స్ అంటూ బీజేపీతో దోస్తాని చేసి రాష్ట్రంలో అధికారం చేజిక్కించు కోవడం.. కూతురిని మంత్రి చేయడం, లిక్కర్ స్కాం నుండి బయటపడేలా చేయడం జరిగిపోతుందనే నమ్మకంతో ఈ ఎత్తు వేసినట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేశారు. అదే జరిగితే తెలంగాణలో కాంగ్రెస్ పై కేసీఆర్ వ్యూహం ఫలించినట్లే, లేదంటే కూతురైన గట్టెక్కుతుందని కేసీఆర్ ఆలోచనలు అని చెబుతున్నారు. ఏదిఏమైనా కవిత లేఖాస్త్రం తెలంగాణ రాజకీయంలో ఓ రసవత్తరమైన ఘట్టంలా మారుతోంది.