జూపార్క్ కి పోటెత్తిన సందర్శకులు....
ఆదివారం సెలవు దినం.. వేసవి సెలవులు కావడంతో నెహ్రూ జూలాజికల్ పార్క్ కి సందర్శకులు పోటెత్తారు. సుమారు 24 వేల మంది విచ్చేశారు. ఎక్కువగా వచ్చే సందర్శకుల కోసం ముందుగానే తగిన ఏర్పాట్లు చేసిన జూ నిర్వాహకులు, విస్తృతమైన సెక్యూరిటీ సిబ్బందిని వివిధ ప్రాంతాల్లో నియమించడం, అదనపు టికెట్ కౌంటర్లు ఏర్పాటు చేయడం, బ్యాటరీ ఆధారిత వాహనాలు మరియు త్రాగునీటి యూనిట్లను ఏర్పాటు చేయడం వంటి చర్యలు చేపట్టారు. సందర్శకుల అధిక సంఖ్య కారణంగా కొంత ఆలస్యం జరిగినా, అదనపు ఏర్పాట్లతో సమస్యను త్వరగా పరిష్కరించారు. జూ పార్క్స్ టీ.ఎస్. డైరెక్టర్ డా. సునీల్ ఎస్. హిరేమత్, ఐ.ఎఫ్.ఎస్., మరియు సిబ్బంది సందర్శకులకు కృతజ్ఞతలు తెలిపారు. నెహ్రూ జూలాజికల్ పార్క్ లో ప్రస్తుతం 194 రకాల 2300 జంతువులు ఉన్నాయి. ఎక్కువ మంది సందర్శకులు వచ్చిన నేపథ్యంలో, జంతువులపై ప్రత్యేక టాక్ షోలు, అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు.