కంపెనీలో ఆపరేటర్.. బయట గంజాయి వ్యాపారం

By Ravi
On
కంపెనీలో ఆపరేటర్.. బయట గంజాయి వ్యాపారం

మహారాష్ట్ర జౌరంగబాద్‌లోని ఒక కంపెనీలో ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. వస్తున్న జీతం సరిపోవడం లేదని గంజాయి వ్యాపారంలోకి దిగాడు. రెండేళ్లుగా ఉద్యోగంతో పాటు గంజాయి వ్యాపారం చేస్తూ డబ్బులు సంపాదిస్తున్నాడు. 2023లో ఒకసారి గంజాయి రవాణ చేస్తూ అబుల్లాపూరమెట్‌లో పట్టుబడ్డాడు. ఈ కేసులో జైలుకు కూడ వెళ్లి వచ్చాడు.   ఐనా గంజాయి వ్యాపారం కొనసాగిస్తున్న జలీలుద్దీన్‌ సిద్దిఖిఅహ్మమద్‌ హుస్సెన్‌ మరోమారు గంజాయిని తరలిస్తూ ఎస్టిఎఫ్ ఏ టీమ్‌ ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడటంతో అసలు విషయం బయటపడింది. సీలేరు నుంచి గంజాయిని తీసుకొని మహారాష్ట్రలోని పలుప్రాంతాల్లో అమ్మకాలు సాగిస్తున్నాడు. లక్ష్మీబాయి అనే మహిళ వద్ద 20.6 కేజీల గంజాయిని తీసుకొని జాతీయ రహదారి 65లో సంగారెడ్డి  పోతురెడ్డిపల్లిలోని పల్లవి అపార్ట్‌మెంట్‌ ప్రాంతంలో కారులో వెళ్తుండగా  సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ రూ. 10 లక్షలు ఉందని తెలిపారు.

Tags:

Advertisement

Latest News

ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది ఢిల్లీ తెలంగాణ భవన్ కి చేరుకున్న 86మంది
ఢిల్లీ చేరుకున్న సరిహద్దు రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ వాసులుఢిల్లీ తెలంగాణ భవన్ లో  86మంది26మందిని సురక్షితంగా వారి స్వస్ధలాలకు తరలింపుఎలాంటి ఇబ్బంది లేకుండా భోజనం, వసతి ఏర్పాట్లు...
కరాచీ బేకరీ వద్ద బీజేపీ ఆందోళన.. బోర్డ్ ధ్వంసం
బాలాపూర్ పిఎస్ లో రోహింగ్యాలపై బీజేపీ ఫిర్యాదు
మీర్పేట్ లో కామ్రేడ్ ఠాణు నాయక్ విగ్రహావిష్కరణ
జోరుగా మందు.. విందు.. ఇంతలో..
సుందరీమణులంతా ఒకచోట చేరారు.. గ్రాండ్ గా వెల్కం చెప్పారు
ఇదేం బుద్ధి రా నాయనా..వీళ్లను కూడా వదలరా...