అప్పన్న దర్శనం సర్వపాపహరణం

By Ravi
On
 అప్పన్న దర్శనం సర్వపాపహరణం


- సింహాద్రి అప్పన్నను దర్శించుకున్న ఎమ్మెల్యేలు
గోండు శంకర్, మామిడి గోవిందరావు 

TPN RAJASEKHAR SRIKAKULAM
Date - 01/05/25

సింహాద్రి అప్పన్న దర్శనం సర్వపాపహరణం అని శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్ పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావులు అన్నారు. సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా నిజరూప దర్శనాన్ని భక్తులకు ఆలయ అధికారులు బుధవారం కల్పించారు. చంద్రవంశానికి చెందిన పురూరవుడు అనే రాజు పుష్పక విమానంలో వెళ్తుండగా ఈ స్థలానికి ఉన్న అత్యంత ప్రశస్తమైన శక్తి ప్రభావం వల్ల పురూరవుడి విమానం క్రిందకు ఆకర్షించబడింది. అతడికి పుట్టలో కప్పబడి ఉన్న వరాహ నరసింహ స్వామి కనిపించాడని తెలిపారు. ఆ సమయంలో ఆకాశవాణి స్వామి విగ్రహాన్ని సంవత్సరకాలం పాటు చందనంతో కప్పి ఉంచి వైశాఖ శుద్ధ తదియ రోజు మాత్రమే చందనం లేకుండా నిజరూప దర్శనం కలిగేటట్లు చేయమని పురూరవుడికి చెబుతుందని వివరించారు. ఆకాశవాణి పలికిన పలుకుల మేరకు పురూరవుడు వరాహ నరసింహ స్వామికి దేవాలయాన్ని నిర్మించారు. ఆ సాంప్రదాయం ఇప్పటికీ పాటిస్తున్నారని స్పష్టం చేశారు .నరసింహ స్వామిలోని వేడిని చల్లార్చడానికి చందనంతో పూత పూస్తుంటారని వివరించారు ఈ కార్యక్రమంలో శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి ఆలయ పీఠాధిపతి గణేష్ గురూజీ, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Advertisement

Latest News

గాంధీలో ఘనంగా నర్సుల దినోత్సవం గాంధీలో ఘనంగా నర్సుల దినోత్సవం
అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా గాంధీలో ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతి నిర్వహించారు. ఆమె చిత్రపటం వద్ద కొవ్వొత్తులు వెలిగించి నివాళులర్పించారు. గాంధీలో నిత్యం నర్సులు విశేష సేవలు...
మహేంద్రహిల్స్ లో ఘనంగా బుద్ధపూర్ణిమ వేడుకలు
బడంగిపేటలో క్యాండిల్ ర్యాలీ.. పాల్గొన్న కాంగ్రెస్ నేతలు
హత్య కేసును ఛేదించిన పోలీసులు.. అయిదుగురు అరెస్ట్
జార్ఖండ్ యువతిపై గ్యాంగ్ రేప్.. ఇద్దరి అరెస్ట్
నకిలీ ఔషధాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. Dca
ఘనంగా కట్టమైసమ్మ జాతర.. భారీగా హాజరైన భక్తులు