రాహుల్‌ గాంధీకి కోర్టు సమన్లు..

By Ravi
On
రాహుల్‌ గాంధీకి కోర్టు సమన్లు..

కాంగ్రెస్‌ అగ్రనేత, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి పుణె కోర్టు నేడు సమన్లు జారీ చేసింది. లండన్‌ పర్యటన సమయంలో స్వాతంత్య్ర సమరయోధుడు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ను ఉద్దేశిస్తూ రాహుల్‌ చేసిన కామెంట్స్ నేపథ్యంలో ఈ సమన్లు అందాయి.  లండన్‌ పర్యటన సమయంలో రాహుల్‌ సావర్కర్‌ను ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో సావర్కర్‌ మనవడు సత్యకి సావర్కర్‌  రాహుల్‌ పై పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రాథమిక ఆధారాలు ఉన్నట్లు పోలీసులు గతంలో తేల్చారు. కాగా.. దీనిపై తాజాగా విచారణ జరిపిన న్యాయస్థానం మే 9న ఆయన తమముందు హాజరుకావాలని కోరుతూ సమన్లు జారీ చేసింది. 

కాగా భారత్‌ జోడో యాత్ర సమయంలో వీర్‌ సావర్కర్‌పై రాహుల్ చేసిన కామెంట్స్ కు తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిపై అలహాబాద్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు కాగా.. లేటెస్ట్ గా హైకోర్టు రాహుల్‌కు సమన్లు జారీ చేసింది. వాటిని సవాలు చేస్తూ ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం విచారణ జరగ్గా.. సుప్రీం రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన వ్యాఖ్యలు బాధ్యాతారహితమైనవిగా పేర్కొంది. రాహుల్‌ వ్యాఖ్యలను మందలిస్తూనే.. ఆయనపై క్రిమినల్‌ చర్యలను నిలిపివేసింది. దీంతో ఆయనకు భారీ ఊరట లభించింది.

Advertisement

Latest News

షాబాద్ లో మట్టిమాఫియాకు చెక్.. నాలుగు లారీలు సీజ్ షాబాద్ లో మట్టిమాఫియాకు చెక్.. నాలుగు లారీలు సీజ్
రంగారెడ్డిజిల్లా చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం  చందన్ వెళ్లి గ్రామంలో మట్టి మాఫియా చెలరేగి పోతోంది.  గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూముల్లో అర్ధరాత్రి మట్టిని తోడి గుట్టుచప్పుడు...
డ్రగ్స్ కేసులో నేరస్తులకు శిక్ష పడేలా చేయాలి. డీజీపీ జితేందర్
ప్రజలు ఆశించిన స్థాయిలో పోలీసులు పని చేయాలి.. డీజీపీ జితేంధర్
గ్రీన్ పార్క్ కాలనీలో చెత్తకుప్పలో పసికందు మృతదేహం
మా కాలనీ రోడ్డును కబ్జా చేశారు కాపాడండి.. హైడ్రాకు విజయలక్ష్మి కాలనీ వాసుల వినతి
బ్యూరోక్రాట్స్ భూదందా.. బద్దలు కొట్టిన ట్రూ పాయింట్ న్యూస్
మస్కిటో కాయిల్ పరుపు మీద పడి.. నాలుగేళ్ల బాలుడు మృతి