పహల్గమా ఉగ్ర దాడిలో ప్రాణాలు వదిలిన భారతీయులకు అశ్రునివాలు
CH.SEKHAR TPN
ఈ రోజు శ్రీకాళహస్తి పట్టణం నందు శ్రీకాళహస్తి ఎమ్మెల్యే శ్రీ బోజ్జల సుధీర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు జమ్మూ & కాశ్మీర్ లోని పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్ర దాడిలో అమాయక ప్రజలు మరియు భద్రతా సిబ్బంది అమరులయ్యారు వారికి కొవ్వొత్తులతో నివాళులు తెలిపిన తెలుగుదేశం పార్టీ నాయకులు.తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. గాయపడిన వారికి త్వరితగతిన ఆరోగ్యవంతులవ్వాలని ఆకాంక్షించారు. దేశ భద్రత కోసం పని చేసే వారి త్యాగం ఎప్పటికీ మరువలేనిదని, ఇటువంటి హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.ఇలాంటి దుశ్చర్యలు దేశాన్ని కుదిపేయలేవని, మన సైనికుల ధైర్యం మరియు ప్రజల ఐక్యత వాటికి బలమైన సమాధానం ఇస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి నియోజకవర్గం నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు