హెచ్ఆర్సీని ఆశ్రయించిన బీఆర్ఎస్ నేత క్రిశాంక్..!
By Ravi
On
హైదరాబాద్ TPN : కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో బీఆర్ఎస్ నేత క్రిశాంక్ హెచ్ఆర్సీని ఆశ్రయించారు. గచ్చిబౌలి పోలీసులు విచారణ పేరుతో వేధిస్తున్నారంటు రాష్ట్ర మానవహక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఈ కేసు విషయంలో మూడు సార్లు విచారణకు పిలిచారని.. మళ్లీ ఈ నెల 23న హాజరు కావాలని పోలీసులు ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన హక్కులకు భంగం కలిగిస్తున్న గచ్చిబౌలి పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Related Posts
Latest News
03 May 2025 20:20:04
కడప-చెన్నై ప్రధాన రహదారిపై అక్రమంగా రవాణా చేస్తున్న 84 ఎర్రచందనం దుంగలను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు ఒక లారీని అదుపులోకి తీసుకున్నారు. కడప- తిరుపతి...