హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్హౌస్ పోలీసులు..!
హైదరాబాద్ TPN : నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ అష్రఫ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. గతంలో అష్రఫ్ లంగర్హౌస్ పోలీస్స్టేషన్లో పరిధిలో డబల్ మర్డర్స్లో నిందితుడిగా ఉన్నాడు. అది మనసులో పెట్టుకుని మృతుల్లో ఒకరి తమ్ముడైన ఇంతియాజ్ అష్రఫ్ను హత్య చేయాలని ప్రణాళిక రచించినట్లు అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ స్పష్టం చేశారు. అష్రఫ్ రియల్ ఎస్టేట్ పార్టనర్లైన సయ్యద్ అఫ్రోజ్, మహమ్మద్ షా ఒవైసీ, మొహమ్మద్ అర్బాజ్ ఖాన్, సయ్యద్ ఫిర్దూజ్, సయ్యద్ ఇంతియాజ్తో కలిసి 18వ తేదీనాడు లంగర్హౌస్ పెన్షన్పురా ప్రాంతంలో ఓ క్వాలిస్ వాహనంలో.. రెండు రివాల్వర్లు, ఐదు రౌండ్ల బుల్లెట్లు పెట్టుకొని ఉన్నారని కచ్చితమైన సమాచారం రావడంతో.. పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి రెండు పిస్టల్స్తోపాటు ఐదు రౌండ్ల బుల్లెట్లు, క్వాలిస్ వాహనంతోపాటు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు అసాంఘిక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటే పోలీసులు చూస్తూ ఊరుకోరని.. వారిని కచ్చితంగా కటకటాల వెనక్కి పంపిస్తామని టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు హెచ్చరించారు.