హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!

By Ravi
On
హత్యా ప్రణాళికను భగ్నం చేసిన లంగర్‌హౌస్ పోలీసులు..!

హైదరాబాద్ TPN : నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో రౌడీషీటర్ అష్రఫ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటాడు. గతంలో అష్రఫ్ లంగర్‌హౌస్ పోలీస్‌స్టేషన్‌లో పరిధిలో డబల్ మర్డర్స్‌లో నిందితుడిగా ఉన్నాడు. అది మనసులో పెట్టుకుని మృతుల్లో ఒకరి తమ్ముడైన ఇంతియాజ్ అష్రఫ్‌ను హత్య చేయాలని ప్రణాళిక రచించినట్లు అడిషనల్ డీసీపీ ఇక్బాల్ సిద్ధిఖీ స్పష్టం చేశారు. అష్రఫ్ రియల్ ఎస్టేట్ పార్టనర్‌లైన సయ్యద్ అఫ్రోజ్, మహమ్మద్ షా ఒవైసీ, మొహమ్మద్ అర్బాజ్ ఖాన్, సయ్యద్ ఫిర్దూజ్, సయ్యద్ ఇంతియాజ్‌తో కలిసి 18వ తేదీనాడు లంగర్‌హౌస్ పెన్షన్‌పురా ప్రాంతంలో ఓ క్వాలిస్ వాహనంలో.. రెండు రివాల్వర్లు, ఐదు రౌండ్ల బుల్లెట్లు పెట్టుకొని ఉన్నారని కచ్చితమైన సమాచారం రావడంతో.. పోలీసులు నిందితులను పట్టుకున్నారు. వారి దగ్గర నుంచి రెండు పిస్టల్స్‌తోపాటు ఐదు రౌండ్ల బుల్లెట్లు, క్వాలిస్ వాహనంతోపాటు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు అసాంఘిక కార్యకలాపాల్లో పాలుపంచుకుంటే పోలీసులు చూస్తూ ఊరుకోరని.. వారిని కచ్చితంగా కటకటాల వెనక్కి పంపిస్తామని టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ శ్రీనివాసరావు హెచ్చరించారు.

Advertisement

Latest News

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..! జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..!
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..!
స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్‌రెడ్డి
శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చెప్పుల దండ..!
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై రఘునందన్‌రావు ఫైర్‌
హైదరాబాద్‌ మారేడ్‌పల్లిలో చైన్ స్నాచింగ్‌..!
తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ హర్షం