స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న- మంత్రి గుమ్మడి సంధ్యారాణి

By Ravi
On
స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో పాల్గొన్న- మంత్రి గుమ్మడి సంధ్యారాణి

పార్వతీపురం మన్యం TPN : మన చుట్టుపక్కల పరిసరాలు శుభ్రంగా ఉంటే మన ఆరోగ్యం కూడా బాగుంటుందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి అన్నారు. స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర కార్యక్రమం లో భాగంగా శనివారం సాలూరు మండల పరిషత్ కార్యాలయం నిర్వహించిన ఈ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల పైనే ఆధారపడి ఉంటుందని, వారు తమ పిల్లలను ప్రేమతో, శ్రద్ధతో పెంచాలన్నారు. ఇది ప్రజా ప్రభుత్వం అయినందున ప్రజలకు ఏవైనా అవసరాలు ఉంటే అవన్నీ కూటమి ప్రభుత్వం ద్వారా నెరవేరుస్తామని తెలిపారు. ప్రతి మూడవ శనివారం ఇంటి పరిసరాలు, కార్యాలయాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ-వ్యర్థాలను సేకరించి, వాటిని సురక్షితంగా రీసైకిల్ చేయడం ద్వారా సంపదగా మార్చి జిల్లాకు అదనపు ఆదాయాన్ని అందించవచ్చని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన స్వర్ణాంధ్ర – 2047 సంకల్పం ప్రకారం ప్రతి నెలా మూడవ శనివారం స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి నెలా ఒక థీమ్‌ ఆధారంగా ఈ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్జీఓలు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆకాంక్షించారు.

Advertisement

Latest News

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..! జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..!
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..!
స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్‌రెడ్డి
శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చెప్పుల దండ..!
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై రఘునందన్‌రావు ఫైర్‌
హైదరాబాద్‌ మారేడ్‌పల్లిలో చైన్ స్నాచింగ్‌..!
తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ హర్షం