తీవ్ర విషాదం.. 148 మంది మృతి

By Ravi
On
తీవ్ర విషాదం.. 148 మంది మృతి

డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగోలో తాజాగా దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ తీవ్ర విషాదంలో నదిలో పడవ బోల్తా పడి 148 మంది ప్రాణాలు కోల్పోయారు. కాంగో నదిలో పడవ బోల్తా పడినప్పుడు మహిళలు, పిల్లలు సహా 500 మంది ప్రయాణికులతో వెళ్తున్నట్లు స్థానిక అధికారులకు మీడియా నివేదికలు తెలిపాయి. మటాంకుము అనే ఓడరేవు నుంచి బోలోంబా ప్రాంతానికి బయలుదేరుతుండగా, హెచ్‌బి కొంగోలో అనే పడవలో ఎంబండకా పట్టణానికి సమీపంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. అధికారులు అప్రమత్తం అయ్యేలోపు దారుణం చోటు చేసుకుంది.

కాగా ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన దాదాపు 100 మందిని స్థానిక టౌన్ హాల్‌లోని టెంపరరీ ఆశ్రయానికి తరలించినట్లు పలు మీడియా సంస్థలు నివేదించాయి. ఈ క్రమంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రులలో చేర్చారు. కాంగోలో పడవ ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. కాంగోలోని గ్రామాల మధ్య రవాణాకు పాత చెక్క పడవలు ఉపయోగిస్తుంటారు. దీంతో తరచుగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. అక్టోబర్ 2023లో, కాంగోలో ప్రయాణిస్తున్న పడవ ఈక్వేటర్‌లో మునిగిపోవడంతో కనీసం 47 మంది మరణించారు. కాగా ఈ ఘటన ఆ ప్రాంతాన్ని తీవ్ర శోక సంద్రంలో ముంచేసింది.

Related Posts

Advertisement

Latest News

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..! జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..!
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..!
స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్‌రెడ్డి
శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చెప్పుల దండ..!
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై రఘునందన్‌రావు ఫైర్‌
హైదరాబాద్‌ మారేడ్‌పల్లిలో చైన్ స్నాచింగ్‌..!
తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ హర్షం