విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్‌..

By Ravi
On
విద్యార్థులకు మద్యం తాగించిన టీచర్‌..

మధ్యప్రదేశ్‌ TPN : నిత్యం ఎన్నో దారుణాలతో ప్రస్తుత సమాజం కొనసాగుతుంది. విద్యా బుద్ధులు నేర్పాల్సిన ఓ ఉపాధ్యాయుడు తన బాధ్యతను మరిచిపోయి మరీ దారుణంగా ప్రవర్తించాడు. విద్యార్థులకు దగ్గరుండి మద్యం పోసి వారు తాగేలా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో కాస్త వైరల్‌ కావడంతో అతడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.  అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌ లోని కఠ్‌నీ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. అంతేకాకుండా స్థానికంగా ఈ ఘటన కలకలం సృష్టించింది.

బార్వారా బ్లాక్‌లోని ఖిర్హానీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో లాల్‌ నవీన్‌ ప్రతాప్‌సింగ్‌ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. తాజాగా అతడు కొందరు విద్యార్థులకు మద్యం తాగించాడు. దీన్ని ఎవరో వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా.. అది వైరల్‌ అయ్యింది. ఈ వీడియో జిల్లా కలెక్టర్‌ దిలీప్‌కుమార్‌ యాదవ్‌ కంటపడింది. దీంతో ఆ ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని ఆయన జిల్లా విద్యాశాఖాధికారి ఓపీ సింగ్‌ను ఆదేశించారు. అనంతరం ప్రతాప్‌సింగ్‌ను సస్పెండ్‌ చేశారు. దీంతో ఇకపై సూళ్ళల్లో ఇలాంటి దుర్మార్గపు చర్యలు జరగకుండా చూడాలని అధికారుల్ని ఆదేశించారు.

Advertisement

Latest News

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..! జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..!
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..!
స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్‌రెడ్డి
శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చెప్పుల దండ..!
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై రఘునందన్‌రావు ఫైర్‌
హైదరాబాద్‌ మారేడ్‌పల్లిలో చైన్ స్నాచింగ్‌..!
తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ హర్షం