మహేష్, రాజమౌళి ప్రాజెక్ట్ పై క్రేజీ అప్డేట్..
సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి కాంబోలో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా సినిమా కోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా మహేష్ బాబు కెరీర్లో 29వ సినిమాగా తెరకెక్కిస్తుండగా నెక్స్ట్ లెవెల్ హైప్ దీనిపై ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ లేట్ గానే మొదలైనా ఇపుడు శరవేగంగా కంప్లీట్ అవుతున్నట్టుగా తెలుస్తుంది. పైగా ఈ సినిమా లోకేషన్స్ విషయంలో కూడా జక్కన్న చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పైగా ఈ సినిమాను మహేష్ బాబు సినీ కెరీర్ లోనే బెస్ట్ మూవీగా తీర్చి దిద్దనున్నారు.
ఇక లేటెస్ట్ గా ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా అప్పుడే మూడో షెడ్యూల్ లోకి ఎంటర్ అయ్యిపోయిందట. దీనితో జక్కన్న అండ్ టీం సైలెంట్ గా అంతే వేగంగా పనులు చేసేసుకుంటున్నారు అని చెప్పొచ్చు. అలాగే ఈ కొత్త షెడ్యూల్ లో నటి ప్రియాంక చోప్రా కూడా జాయిన్ అయినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి మాత్రం ఈ భారీ సినిమా ఫుల్ స్వింగ్ లో నడుస్తుంది అని చెప్పవచ్చు.