భగవద్గీత, నాట్యశాస్త్రానికి యునెస్కో గుర్తింపు
భారతీయ సంస్కృతికి, వారసత్వానికి గుర్తింపు లభించింది. భగవద్గీత, భరతముని రచించిన నాట్యశాస్త్రానికి యునెస్కో మెమరీ ఆఫ్ వరల్డ్ రిజిస్టర్ లో గుర్తింపు లభించింది. ఈ విషయాన్ని కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. దీనిపై మోదీ ఆనందం వ్యక్తం చేశారు. ఇది ప్రతి భారతీయుడు గర్వించాల్సిన విషయమని అన్నారు. భారతీయ జ్ఞాన సంపద, కళాత్మక ప్రతిభను యావత్ ప్రపంచం గౌరవిస్తోంది. ఈ రచనలు మన దేశంపై ప్రపంచ దృక్పథానికి, మన జీవన విధానానికి పునాదులు అని, ఇప్పటివరకు మన దేశం నుంచి 14 శాసనాలు.. యునెస్కో రిజిస్టర్లో చోటు దక్కించుకున్నాయి అని కేంద్రమంత్రి తన పోస్ట్లో తెలిపారు.
ఈ విషయంపై ప్రధాని మోదీ రెస్పాన్డ్ అవుతూ.. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. గీత, నాట్యశాస్త్రాన్ని యునెస్కో రిజిస్టర్లో చేర్చడం.. మన జ్ఞాన సంపద, సంస్కృతికి లభించిన ఘనమైన గుర్తింపు. ఇవి శతాబ్దాలుగా మన నాగరికత, ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాయని, ప్రపంచానికి స్ఫూర్తినిస్తూనే ఉన్నాయని నరేంద్ర మోదీ సంతోషం వ్యక్తం చేశారు. కాగా ఈ విషయం ప్రస్తుతం నేషనల్ వైడ్ గా గర్వకారణంగా మారింది.