సీఎం హైజాక్‌ అయ్యారు : తేజస్వి యాదవ్‌

By Ravi
On
సీఎం హైజాక్‌ అయ్యారు : తేజస్వి యాదవ్‌

దేశంలోని రాజకీయాలు సైతం ఉత్కంఠభరితంగా ఉన్నాయని అనేందుకు నిదర్శనంగా బీహార్ పాలిటిక్స్ నిలిచాయి. బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ హైజాక్‌ అయ్యారని ఆర్జేడీ కీలక నేత తేజస్వి యాదవ్‌ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్ల కోసం ఢిల్లీలో కాంగ్రెస్‌ నాయకత్వంతో జరిగిన సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. బీహార్‌లో ప్రతిపక్ష కూటమి పటిష్టంగా ఉందని, బీహార్‌ ను ముందుకు తీసుకెళ్లేందుకు సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు. బీహార్‌లోని ప్రతిపక్ష కూటమి పార్టీలు ఈ నెల 17న మరోసారి సమావేశమవుతాయని, పాట్నాలో ఈ సమావేశం జరుగుతుందని అన్నారు. నితీష్‌ కుమార్‌ 20 ఏళ్ల పాలనలో బీహార్‌ రాష్ట్రం పేద రాష్ట్రంగా మిగిలిపోయిందని విమర్శించారు. 

తలసరి ఆదాయం, రైతుల రాబడి తగ్గిపోయాయని, వలసలు పెరిగిపోయాయని తేజస్వి యాదవ్ ఆరోపించారు. ఇవాళ్టి సమావేశంలో సానుకూల చర్చలు జరిగాయని అన్నారు. ప్రజా సమస్యలను బేస్‌ చేసుకునే తాము ఎన్నికల్లో తలపడుతామని అన్నారు. ప్రభుత్వ లోపాలను ప్రజలకు అర్థమయ్యేలా ఎత్తిచూపడం ప్రతిపక్షాల బాధ్యత అని తెలిపారు. ప్రతిపక్ష కూటమి తరఫున సీఎం అభ్యర్థి ఎవరనే ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. అందరం ఏకగ్రీవంగా సీఎం అభ్యర్థిని ఎన్నుకుంటామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.

Advertisement

Latest News

15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా 15 ఎకరాల భూమి కబ్జా.. రంగంలోకి హైడ్రా
మేడ్చ‌ల్  జిల్లా: కుత్బుల్లాపూర్ మండ‌లం గాజుల‌రామారం విలేజ్‌లో 15 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమిని హైడ్రా స్వాధీనం చేసుకుంది. స‌ర్వే నంబ‌రు 354లో ఉన్న ప్ర‌భుత్వ భూమిలో క‌బ్జాల‌ను...
మీర్పేట్ లో బిఆర్ఎస్ నేతల సంబరాలు
ఇంట్లోనే మినీ వైన్స్.. ఎక్సైజ్ పోలీసుల రైడ్
రేపు నగరంలో ఈ 4 కీలక ప్రాంతాల్లో మాక్ డ్రిల్
ఓబుళాపురం మైనింగ్ కేసులో జడ్జిమెంట్ ఇచ్చిన నాంపల్లి సీబీఐ కోర్టు.. 5గురికి శిక్ష..ఇద్దరికి క్లీన్ చిట్
మహేశ్వరం మండలంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం
రోడ్డుకు అడ్డంగా ప్రహరీ నిర్మాణం.. నేలమట్టం చేసిన హైడ్రా