ముంబై అరుదైన రికార్డ్ నమోదు..

By Ravi
On
ముంబై అరుదైన రికార్డ్ నమోదు..

ఐపీఎల్ 2025 సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు సెకండ్ సక్సెస్. ఢిల్లీ క్యాపిటల్స్‌ను 12 పరుగుల తేడాతో ఓడించింది. చివరివరకూ ఉత్కంఠభరితంగా సాగిన పోరులో ఢిల్లీని రనౌట్లు ఇబ్బందికి గురి చేశాయి. ఇన్నింగ్స్‌ 19వ ఓవర్‌లో మూడు రనౌట్లు కావడంతో ఢిల్లీకి ఓటమి తప్పలేదు. ఈ క్రమంలో ముంబయి ఓ అరుదైన ఘనతను తన అకౌంట్ లో వేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబయి  205 పరుగులు చేసింది. తర్వాత ఢిల్లీ 193 పరుగులకే ఆలౌటైంది. దీంతో 200+ స్కోరును టార్గెట్‌గా ఫిక్స్ చేసిన 15 మ్యాచుల్లోనూ ముంబై గెలిచింది. ఐపీఎల్ చరిత్రలో ఇలా ఒకే ఓవర్‌లో మూడు రనౌట్లు కావడం ఇది రెండోసారి మాత్రమే. 

కాగా ఇది 2008 సీజన్‌లో నమోదైంది. అప్పుడు పంజాబ్‌ కింగ్స్‌ ఒక్క పరుగు తేడాతో గెలిచింది. చివరి బంతికి రెండు పరుగులు అవసరం కాగా.. విక్రాంత్‌ను యువరాజ్‌ రనౌట్‌ చేసి తన జట్టును గెలిపించాడు. ముంబయి ఇన్నింగ్స్‌లో మొత్తం ఐదు రనౌట్లు అయ్యాయి. ఇప్పటికీ ఇదే ఐపీఎల్‌లో రికార్డు. అందులో మూడు చివరి ఓవర్‌లోనే జరిగాయి. ఒకే వేదికలో అత్యధిక ఓటములు చవిచూసిన జట్టుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో కలిసి ఢిల్లీ క్యాపిటల్స్‌ నిలిచింది.

Advertisement

Latest News

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..! జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..!
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..!
స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్‌రెడ్డి
శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చెప్పుల దండ..!
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై రఘునందన్‌రావు ఫైర్‌
హైదరాబాద్‌ మారేడ్‌పల్లిలో చైన్ స్నాచింగ్‌..!
తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ హర్షం