పాకిస్థాన్లో తీవ్రస్థాయిలో భూకంపం
పాకిస్థాన్ లో తాజాగా భారీ భూకంపం చోటు చేసుకుంది. ఈ క్రమంలో అక్కడి అధికారులు ఈ విషయాన్ని తెలియజేశారు. రిక్టర్ స్కేల్ పై ఈ భూకంపం తీవ్రత 5.8 గా నమోదు చేశారు. కాగా శనివారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వచ్చిన తీవ్ర స్థాయి భూప్రకంపనలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా ఈ ఘటనకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది. ముఖ్యంగా ఆస్తి, ప్రాణ నష్టాలకు సంబంధించిన వివరాలు ఇంకా తెలియలేదు.
అయితే 10 కి.మీ లోతులో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ నిర్ధారించింది. పంజాబ్ ప్రావిన్స్లోని అటాక్ జిల్లాలో భూకంప కేంద్రం గుర్తింపబడినట్లుగా తెలిపింది. కాశ్మీర్ వరకు ప్రకంపనలు సంభవించాయని పలు అధికార నివేదికలు చెబుతున్నాయి. ప్రస్తుతం పాకిస్థాన్లో రైలు వేగాన్ని తాత్కాలికంగా తగ్గించింది. అయితే హై-స్పీడ్ రైళ్లతో సహా అన్ని రైలు సేవలు అంతరాయం లేకుండా మాత్రం కొనసాగుతున్నాయి. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.