సీఎస్కే ఓటమిపై ధోని రెస్పాన్స్ ఇదే..
స్కోరు బోర్డుపై సరిపడా రన్స్ చేయకపోవడమే తమ ఓటమికి కారణం అని సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ అన్నారు. గత మ్యాచ్ లలో రెండో ఇన్నింగ్స్లో కూడా రన్ చేయడంలో ఫెయిల్ అయ్యామని, ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లోనే దారుణంగా ఓటమిపాలయ్యామని అన్నారు. అయితే వేరే ఆటగాళ్లను ఫాలో అవుతూ వారి లాగానే ఆడాలనుకోవడం రాదన్నాడు. పరిధులు దాటి హిట్టింగ్ మాత్రమే చేయాలనే దృక్పథం తమకు లేదని, అది చేతకాదు కూడా అని మహేంద్ర సింగ్ ధోనీ అన్నారు. ఐపీఎల్ 2025లో భాగంగా శుక్రవారం చెపాక్ వేదికగా కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై దారుణ ఓటమిని ఎదుర్కొంది.
మ్యాచ్ తర్వాత సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనీ మాట్లాడుతూ.. గత కొన్ని రోజులుగా మాకు ఏదీ కలిసిరావడం లేదు. మా ముందు ఎన్నో సవాళ్లున్నాయి, వాటిని ఎదుర్కొనేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. మేము స్కోరు బోర్డుపై సరిపడా పరుగులు చేయలేదనేది వాస్తవం. రెండో ఇన్నింగ్స్లో బంతి కాస్త నెమ్మదిస్తుందని భావించాం కానీ, తొలి ఇన్నింగ్స్ నుంచి బ్యాటింగ్కు కష్టంగా మారింది. త్వరగా వికెట్లు కోల్పోయినప్పుడు ఒత్తిడి ఉంటుందని ధోనీ అన్నారు.