పాతబస్తీలో భజరంగ్దళ్ భారీ బైక్ ర్యాలీ
హైదరాబాద్ పాతబస్తీలో హనుమాన్ జయంతి సందర్భంగా గౌలిపుర డివిజన్లోని ఆలే నరేంద్ర స్పోర్ట్స్ కాంప్లెక్స్ నుంచి విశ్వహిందూ పరిషత్ మరియు బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సౌత్ జోన్ డీసీపీ స్నేహమెహర హాజరై ప్రత్యేక పూజ నిర్వహించిన అనంతరం జెండా ఊపి బైక్ ర్యాలీ ప్రారంభించారు. ఈ బైక్ ర్యాలీలో నలుమూలల నుంచి వేలాదిమంది భక్తులు, యువకులు కాషాయం జెండాలతో జైశ్రీరామ్ నినాదాతో కన్నుల పండుగగా బైక్ ర్యాలీ ముందుకు సాగింది. ఈ బైక్ ర్యాలీ సందర్భంగా పాతబస్తీలోని ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సౌత్ జోన్ డీసీపీ స్నేహమెహర నేతృత్వంలో అడుగడుగున సీసీ కెమెరాలతో బైక్ ర్యాలీ కదలికలను పరిశీలిస్తూ భారీ బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ ఎండీ జావిద్, ఛత్రినాక ఏసీపీ సీహెచ్ చంద్రశేఖర్, ఛత్రినాక సీఐ నాగేంద్ర ప్రసాద్ వర్మ, మొగల్పుర సీఐ శ్రీనుతోపాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.