సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

By Ravi
On
సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

 

రామచంద్రపురం: రామచంద్రపురం పట్టణం పాత బస్టాండ్ వద్ద సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరం స్థానిక పాత బస్టాండ్ లో పూల వ్యాపారం చేసే నాగిరెడ్డి వెంకన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడింది.

రైతు బజార్ కాంప్లెక్స్ లో నిర్వహించబడిన ఈ ఉచిత వైద్య శిబిరంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుండి వందల సంఖ్యలో పేదలు వైద్య సేవలు పొందేందుకు తరలివచ్చారు.

ఈ శిబిరంలో డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, డాక్టర్ కె.వి.వి. సత్యనారాయణ, మరియు డాక్టర్ ఇషాదీపిక ప్రముఖ వైద్యులు తమ సేవలను అందించారు. బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించబడిన అనంతరం, అవసరమైన మందులు ఉచితంగా అందించారు.

సుఖీభవ ట్రస్ట్ ట్రెజరర్ నేదూరి శేషగిరి మాట్లాడుతూ, సుఖీభవ ట్రస్ట్ ప్రతి నెలలో నాలుగో మంగళవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించడమే కాకుండా, ప్రతిరోజూ అన్నదానం, వేసవికాలం చలివేంద్రంలో మంచినీళ్లు మరియు మజ్జిగ అందిస్తున్నట్లు చెప్పారు.

ఈ కార్యక్రమంలో చింతా వెంకటరెడ్డి (బాబులు) మరియు జబర్దస్త్ ఫేమ్ రైజింగ్ రాజు ముఖ్య అతిథులుగా పాల్గొని, సుఖీభవ ట్రస్ట్ సభ్యులను అభినందించారు.

రైజింగ్ రాజు మాట్లాడుతూ, తన పుట్టిన ఊరు రామచంద్రపురం లో ఇలాంటి గొప్ప సేవా సంస్థ ఉన్నందుకు గర్వపడతున్నట్లు చెప్పారు. సుఖీభవ ట్రస్ట్ ద్వారా పేదలకు సేవలు అందించే ఈ కార్యక్రమం మరింతగా ప్రజల మనస్సులను చలించుకుంటుందని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో వాసంశెట్టి వీర వెంకటరమణ, నేదూరి శేషగిరి, ఈతా ప్రసాద్, దూళిపూడి ప్రభాకర్ రావు, యాగా రాంబాబు, యాగా దుర్గారావు, యాండ్ర బుల్లెబ్బులు, నక్కా చంద్రరావు, నేదునూరి శ్రీనివాసరావు, దండుబోయిన త్రిమూర్తులు, జగ్గంపూడి కృష్ణ, కొయ్య బంగారు బాబు, నేదూరి లక్ష్మి, సూర్య ప్రకాశరావు, గుండుపల్లి కృష్ణ మరియు ఇతరులు పాల్గొన్నారు.

సుఖీభవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేదల కోసం కొనసాగుతున్న సేవలు ప్రజలకి నూతన ఆశలను తెస్తున్నాయి.

Tags:

Advertisement

Latest News

మంత్రికి తమ సమస్యలు చెప్పుకున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి. మంత్రికి తమ సమస్యలు చెప్పుకున్న ప్రవీణ్ కుమార్ రెడ్డి.
తిరుపతి లో మంగళవారం కలెక్టర్ ఆఫీస్ నందు, ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు, తిరుపతి జిల్లా ఇన్చార్జ్  అనగాని సత్యప్రసాద్ ను, సత్యవేడు నియోజకవర్గ టిడిపి మండల అధ్యక్షులు కుప్పాని...
మాజీ మంత్రి పెద్దిరెడ్డి ని కలిసిన వైసిపి నాయకులు..
మహిళా భవన్‌ని పరిశీలించిన మేయర్‌ విజయలక్ష్మీ..!
మంచు విష్ణుపై మనోజ్‌ ఫిర్యాదు..!
జంట పేలుళ్ల కేసులో హైకోర్టు సంచలన తీర్పు..!
ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెనుప్రమాదం..!
సొంతంగా ఎదిగేందుకు హరీష్‌రావు ప్లాన్‌..!