అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నిరసన

2 లక్షల రుణమాఫీని అమలు చేయాలని డిమాండ్

By Ravi
On
అసెంబ్లీ సమావేశాల్లో బీఆర్ఎస్ నిరసన

హైదరాబాద్, మార్చి 24:

రెండు లక్షల రూపాయల రుణమాఫీని పూర్తిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, బీఆర్ఎస్ శాసనసభ సభ్యులు అసెంబ్లీ సమావేశాల్లో నిరసన తెలిపారు. ఈ నిరసనను మాజీ మంత్రి హరీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నల్లబ్యాడ్జీలతో సమరానికి దిగారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని అమలు చేయకుండా మాట తప్పిందని, రుణమాఫీ బూటకం అని, కాంగ్రెస్ నాటకంగా పేరు పెట్టి సభలో నినాదాలు చేశారు. "రుణమాఫీ బూటకం, కాంగ్రెస్ నాటకం!", "రెండు లక్షల రుణమాఫీ అరకొర, కాంగ్రెస్ కొరకొర!" అంటూ ఆందోళన వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ను నిరసిస్తూ, ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు న్యాయం చేయాలని, రుణమాఫీని వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.

ఈ నిరసన ఘటనతో అసెంబ్లీ సమావేశాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..