మహేశ్వరాన్ని ఫ్యూచర్ సిటిలో కలపాలని మంత్రి శ్రీధర్ బాబును కోరిన మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి

By Ravi
On
మహేశ్వరాన్ని ఫ్యూచర్ సిటిలో కలపాలని మంత్రి శ్రీధర్ బాబును కోరిన మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి

రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు, జేఏసీ చైర్మన్ రఘుపతి మరియు అఖిలపక్ష నాయకులు మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటిలో కలపాలని వినతి పత్రాన్ని అందజేశారు. ఈ వినతి పత్రం, మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో మంత్రితో మంత్రి క్వార్టర్స్ లో జరిగిన సమావేశంలో అందజేయబడింది.

ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, "మహేశ్వరం మండలాన్ని అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఫ్యూచర్ సిటిలో కలపడానికి ప్రయత్నిస్తాం" అని హామీ ఇచ్చారు. ఆయన గతంలో కేఎల్‌ఆర్ కూడా కందుకూరు, మహేశ్వరం మండలాలను కలపాలని సూచించారని, ప్రజల ఆకాంక్షలు, అఖిలపక్ష నాయకుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకొని దీనిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్న గారి లక్ష్మారెడ్డి, జేఏసీ చైర్మన్ రఘుపతి, మహేశ్వరం మండల అఖిలపక్ష నాయకులు పాల్గొన్నారు.

Tags:

Advertisement

Latest News

అడవి తల్లి బాటతో గిరిజన గ్రామాలకు మహర్ధశ అడవి తల్లి బాటతో గిరిజన గ్రామాలకు మహర్ధశ
పెదపాడు గ్రామంలో గిరిజనాభివృద్ధికి శ్రీకారం రూ. 2.12 కోట్ల అంచనా వ్యయంతో బీటీ రోడ్డుకి శంకుస్థాపన పెదపాడులో గిరిజనులతో ముఖాముఖీ ఆరు నెలల్లో 12 అభివృద్ధి కార్యక్రమాల...
ఇషాంత్ శ‌ర్మ‌కు బీసీసీఐ ఫైన్.. కారణం ఏంటంటే?
బట్టతలపై జుట్టు మొలిపిస్తానంటూ మోసం
16 ఏళ్ల అమ్మాయిపై బ్యాడ్మింట‌న్ కోచ్ అరాచకం
ఆర్సీబీపై బుమ్రాకు అదిరిపోయే రికార్డ్
నేడు హైఓల్టేజ్ తో ముంబై వర్సెస్ ఆర్సీబీ
శ్రీలంకతో భారత్ మొదటి రక్షణ ఒప్పందం