మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలని జేఏసీ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం

By Ravi
On
మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలని జేఏసీ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం


మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో కలపాలని కోరుతూ జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్ష నేతలు మహేశ్వరం నియోజకవర్గంలోని అమీర్పేట్ పద్మావతి ఫంక్షన్ హాల్‌లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జేఏసీ చైర్మన్ రఘుపతి నేతృత్వం వహించారు.

ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, మహేశ్వరం మండలాన్ని ఫ్యూచర్ సిటీలో విలీనం చేయడం అనివార్యమని పేర్కొన్నారు. "మా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాం. ఇందుకోసం అవసరమైన అన్ని చర్యలు, త్యాగాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాం" అని జేఏసీ సభ్యులు పేర్కొన్నారు.

సమావేశంలో రేపు ప్రముఖ రాజకీయ నేతలతో చర్చలు జరిపి మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన రంగారెడ్డి ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు, ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డికి మెమోరాండం ఇవ్వనున్నట్లు తెలిపారు. నాయకుల స్పందన ఆధారంగా భవిష్యత్ కార్యచరణ నిర్ణయిస్తామన్నారు.

ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నేతలు, మహేశ్వరం మండల ప్రజలు, సామాజిక సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..