ప్రభుత్వ భూమి కబ్జా..హైకోర్టులో పిల్ వేసిన నలుగురు ఎమ్మెల్యేలు

On
ప్రభుత్వ భూమి కబ్జా..హైకోర్టులో పిల్ వేసిన నలుగురు ఎమ్మెల్యేలు

శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందంటూ నలుగురు ఎమ్మెల్యేలు యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాజేశ్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి, మురళీనాయక్ పిల్ దాఖలు చేశారు. దీనిపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ పిటిషన్పై సీనియర్ న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ వాదనలు వినిపించారు. ఖాజాగూడలోని సర్వే నెంబర్ 119, 122లో ఉన్న 27.18 ఎకరాల భూమిని ఆక్రమించారన్నారు. సర్వే నెంబర్ మార్చి పోరంబోకు భూమిని ఆక్రమించారని చెప్పారు. భూమి విలువ రూ.10 వేల కోట్లు ఉంటుందని తెలిపారు.
రంగారెడ్డి కలెక్టర్ 2023లో నిరభ్యంతర పత్రం జారీ చేయడంతో జీహెచ్ఎంసీ భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిందని న్యాయవాది పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ స్థలంలో 8 టవర్లు నిర్మిస్తున్నారని, ఒక్కో దాంట్లో 47 అంతస్తులు ఉన్నాయని వివరించారు. ఇవన్నీ ఖాజాగూడ చెరువు ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నాయని తెలిపారు. మరోవైపు ఓ ప్రేవేటు పాఠశాలకు 150 మీటర్ల పరిధిలోనే రెడీమిక్స్ ప్లాంటు ఏర్పాటు చేశారని చెప్పారు. దీంతో పర్యావరణం కాలుష్యమై విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని న్యాయవాది వివరించారు. ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకునేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని చిక్కుడు ప్రభా కోర్టును కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వం, రెవెన్యూ ముఖ్యకార్యదర్శి, రంగారెడ్డి కలెక్టర్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, హైడ్రాకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.421329-implementation-of-the-comprehensive-crop-insurance-scheme-telangana-high-court-notified-the-governing-bodies-in-a-public-interest-litigation

Advertisement

Latest News