ఎక్సైజ్‌ స్టేషన్లలో ఆన్‌లైన్‌ వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు

On
ఎక్సైజ్‌ స్టేషన్లలో ఆన్‌లైన్‌ వ్యవస్థ ఏర్పాటుకు సన్నాహాలు

  • ఎన్ఐసి అధికారులతో డైరెక్టర్ షానవాజ్ ఖాసీం భేటి
  • 139 స్టేషన్ లలో ఇక ఆన్ లైన్ సేవలు
  • ఆగస్టు నుండి పూర్తిస్థాయిలో అందుబాటు

హైదరాబాద్:  IMG-20250616-WA0038ఎన్‌ఐసీ అధికారులతో ఎక్సైజ్ డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ ఖాసీ భేటి అయ్యారు. పోలీస్‌ శాఖ రీతిలో అన్‌లైన్‌లో   ఎఫ్ఆర్‌ ఐ నమోదుతో పాటు ఇతర అంశాలను  కూడ ఎక్సైజ్‌ శాఖలో ఆన్ లైన్ లోకి  తీసుక రావడానికి చర్యలు చేపట్టామని ఆయన అన్నారు. సోమవారం ఎక్సైజ్‌ భవన్‌లో ఎస్‌ఐసీ సాంకేతిక నిపుణులు, ఎక్సైజ్‌ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. 
ఈ సమావేశంలో ఎన్‌ఐసీ ఇంజనీర్లతోపాటు డైరెక్టర్‌, జాయింట్‌ కమిషనర్‌ సయ్యద్ యాసిన్‌ ఖురేషితోపాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఇంచార్జులు పాల్గొన్నారు.
తెలంగాణలో ప్రస్తుతం నడుస్తు 139 ఎక్సైజ్‌ స్టేషన్లలో కేసుల నమోదు, ఎఫ్ఆర్ ఐ  మ్యాన్‌వల్‌ పద్దతిలో జరుగుతున్నాయి.  అన్ని స్టేషన్లలో ఆగస్టు నుంచి అన్‌లైన్‌లో ఎఫ్ ఆర్ ఐ  నమోదుతో పాటు , క్రైమ్‌ ప్యాటన్‌లో మార్పులు చేయడానికి డైరెక్టర్‌ అదేశించారు.
ఎన్‌ఐసీ చేపట్టిన నమూనాలో డైరెక్టర్‌ షాన్‌వాజ్‌ ఖాసీం పలుమార్పులు సూచించారు. మార్పులతోపాటు ఈ నెల 25న జరిగే సమావేశంలో తుది దశకు తీసుకు వెళ్లాలని అన్నారు.  25న మీటింగ్‌ అనంతరం తెలంగాణలోని పది డిప్యూటి కమిషనర్లు,  అసిస్టెంట్‌ కమిషనర్ల అభిప్రాయాలతో మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటుందని  అన్నారు. ఈ సాంకేతికతకు జూలైలో పూర్తి తుది రూపం ఇచ్చి ఆగస్టు నుంచి అమలులోకి తీసుకరావాలని డైరెక్టర్‌ సూచించారు.
ఈ సమావేశంలో జి .శ్రీకాంత్‌ ఎన్‌ఐసీ డైరెక్టర్‌, సిహెచ్‌. శ్రీనివాసరావు జాయింట్‌   డైరెక్టర్‌, ఎన్‌ఫొర్స్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ ప్రణవీ,  ఎన్‌ఫొర్స్‌ టీమ్‌ ఏ,సీ టీమ్‌ లీడర్లు నంద్యాల అంజి రెడ్డి, తుల శ్రీనివాసరావు, సీఐ చంద్ర`శేఖర్‌గౌడ్‌, జగన్‌మోహన్‌, ఎన్‌. శ్రీనివాసులు పాల్గొన్నారు.