ఆర్ఎంపి వైద్యం.. జిమ్ కోచ్ మృతి.. టెన్షన్..

On
ఆర్ఎంపి వైద్యం.. జిమ్ కోచ్ మృతి.. టెన్షన్..

సికింద్రాబాద్‌ : రీసాలబజార్‌లో టెన్షన్ నెలకొంది. ఆర్‌ఎంపీ వైద్యుడి నిర్లక్ష్యంతో జిమ్‌ కోచ్‌ మృతి చెందాడు. ఛాతీలో నొప్పి రావడంతో స్థానిక క్లినిక్‌కు వెళ్లిన జిమ్‌కోచ్‌ జ్ఞానేశ్వర్‌ గ్యాస్ట్రిక్‌ సమస్య అని ఇంజక్షన్‌ ఇచ్చి పంపించాడు ఆర్‌ఎంపీ వైద్యుడు. క్లినిక్‌ నుంచి ఇంటికి వెళ్లిన కాసేపటికే జ్ఞానేశ్వర్‌ మృతి చెందాడు. దీనితో క్లినిక్‌ వద్ద అతని కుటుంబ సభ్యులు  ఆందోళన చేపట్టారు.. ఆర్‌ఎంపీ వైద్యుడిని బొల్లారంలో అదుపులోకి తీసుకున్న పోలీసులు డెడ్ బాడీనీ పోస్ట్ మార్టం కోసం గాంధీ మార్చురీ తరలించారు. కోచ్ కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.