నాంపల్లి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి – వృద్ధుడి మృతి

On
నాంపల్లి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి – వృద్ధుడి మృతి

హైదరాబాద్‌, జూన్ 8: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో శనివారం జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో విషాదం చోటుచేసుకుంది. మెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణ (75) అనే వృద్ధుడు క్యూ లైన్‌లో నిలుచున్న సమయంలో అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు.

సాక్షుల మాటల ప్రకారం, ఆయనకు హార్ట్ స్ట్రోక్ వచ్చినట్లు అనుమానిస్తున్నారు. అక్కడే ఉన్న వైద్య బృందం వెంటనే స్పందించి ప్రాథమిక చికిత్స అందించింది. సీపీఆర్ చేసినప్పటికీ ఫలితం లేకుండా ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

వృద్ధుడి మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కార్యక్రమ నిర్వాహకులు ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. భారీ జనసందరిభంలో ఏర్పడే ఒత్తిడి, వృద్ధుల ఆరోగ్య పరిస్థితులు ఇలా అపశ్రుతులకు దారితీయవచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు.

ఈ ఘటన నేపథ్యంలో భవిష్యత్తులో మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Latest News

విజయవాడలో యోగ అవగాహన ర్యాలీలు – కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు విజయవాడలో యోగ అవగాహన ర్యాలీలు – కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
విజయవాడ నగరపాలక సంస్థ08-06-2025  యోగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాలి   ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సచివాలయంలో ర్యాలీ జరగాలి  
అమరావతిని కించపరిచే వ్యాఖ్యలపై ఎమ్మెల్యే విజయశ్రీ పోలీసులకు ఫిర్యాదు
తెప్పపై శోభాయాత్రలో శ్రీ సుందరరాజ స్వామి
ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన
సూళ్లూరుపేటలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
నాంపల్లి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి – వృద్ధుడి మృతి