ఫాస్ట్ ఫుడ్ సెంటర్లపై మున్సిపల్ అధికారుల దాడులు..
By Ravi
On
మేడ్చల్: పట్టణంలోని చికెన్ సెంటర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పై మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించారు. కుళ్లిపోయిన చికెన్ అమ్ముతున్నారంటూ అందిన ఫిర్యాదులు మేరకు మేడ్చల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి సమక్షంలో నగరంలోని చికెన్ సెంటర్ లో, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. మేడ్చల్ పట్టణం రైల్వే స్టేషన్ రోడ్ లోని సుగుణ చికెన్ సెంటర్, అక్బర్ చికెన్ సెంటర్ తో పాటు బస్టాండ్ రోడ్డులోని ఎస్ఎఫ్సి ఫాస్ట్ ఫుడ్ సెంటర్ లో కుళ్లిపోయిన చికెన్ తో పాటు ఆహార పదార్థాలలో నిలువ ఉండడంతో సుగుణ చికెన్ సెంటర్, అక్బర్ చికెన్, ఎస్ ఎఫ్ సి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను సీజ్ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నాగిరెడ్డి మాట్లాడుతూ కుళ్ళిపోయిన చికెన్ గాని, ఆహార పదార్థాలను నిల్వ ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Related Posts
Latest News
07 Jun 2025 22:11:00
మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ అగంతకుడు ఆమెను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. మేయర్ తో పాటు, మేయర్ తండ్రి కే కేశవరావు...