పనులన్నీ పక్కన పెట్టి పరుగున వచ్చిన కేటీఆర్..

By Ravi
On
పనులన్నీ పక్కన పెట్టి పరుగున వచ్చిన కేటీఆర్..

లండన్ పర్యటనలో ఉన్న బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తన పర్యటన అర్ధాంతరంగా ముగించుకొని హైదరాబాద్ చేరుకున్నారు. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్యం క్షీణించడంతో తన పర్యటన ముగించుకొని వచ్చారు. ఆయన ఆస్పత్రిలో చేరినప్పటి నుండి కేటీఆర్ సతీమణి ద్వారా గంటకోసారి ఆరోగ్య విషయం అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి కొంత ఆందోళనగా ఉందని తెలియడంతో వెంటనే శంషాబాద్ నుండి నేరుగా గచ్చిబౌలి ఏఐజి ఆస్పత్రికి బయలుదేరారు. కొంత కాలంగా గోపీనాథ్ అస్వస్థతతో ఉన్నారు. కొద్ది నెలల క్రితం కిడ్నీ సంబంధిత సమస్యలతో చికిత్స తీసుకుంటున్నారు. దీనికి సంబంధిత చికిత్స తీసుకుంటున్న సమయంలోనే క్యాన్సర్ కు గురయ్యారు. ఇక గుండె పోటు రావటంతో గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ వైద్యులు గోపీనాథ్ కు క్రిటికల్ కేర్ యూనిట్ లో చికిత్స అందిస్తున్నారు.

Advertisement

Latest News

మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్.. మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్..
మేయర్ గద్వాల విజయలక్ష్మికి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అర్ధరాత్రి ఫోన్లు చేస్తూ అగంతకుడు ఆమెను భయబ్రాంతులకు గురిచేస్తున్నాడు. మేయర్ తో పాటు, మేయర్ తండ్రి కే కేశవరావు...
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవాలు ఘనంగా ప్రారంభం
ఒప్పంద ఉద్యోగిని పెత్తనం
మహిళా సాధికారతకు నిరంతరకృషి
శ్రీకాళహస్తిలో భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యశాల
పద్మారెడ్డి కుటుంబ సభ్యులకు త్రిపుర గవర్నర్ పరామర్శ..
నూతన దుకాణ సముదాయాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి..