పదో తరగతి ఫలితాల్లో విశ్రా విద్యార్థుల విజయకేతనం..!

By Ravi
On
పదో తరగతి ఫలితాల్లో విశ్రా విద్యార్థుల విజయకేతనం..!

రంగారెడ్డి TPN : తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన 10వ తరగతి ఫలితాలలో విశ్ర విద్యా సంస్థల విద్యార్థులు విజయ దుందుభి మ్రోగించారు. 

43 మంది విద్యార్థులలో 600 మార్కులకు గాను 550 పైన మార్కులను 5 గురు విద్యార్థులు, 500 పైన మార్కులను 20 మంది విద్యార్థులు సాధించారు. 43 కి 43 మంది విద్యార్థులు ఉత్తీర్ణతో 100% ఉత్తీర్ణత  సాధించామని విశ్రా విద్యాసంస్థల డైరెక్టర్ దోర్బల హరిహరనాథ శర్మ తెలిపారు

జి. సిద్ధార్థ్ సింహ ఆర్య-600ల మార్కులకు గాను 581, బి. జీవన్ బాలాజీ-577, ఓ. మనోహర్-562, ఎ. మయాంక్- 562, కే దీక్షిత -552, ఏ అక్షిత రెడ్డి-549, జి భాను -548, ఎన్ సచిన్-547, రోహన్  చవాన్-545 మరికొంత మంది ఉత్తమ మార్కులను సాధించారని తెలిపారు. సబ్జెక్ట్స్ వారీగా 'ఏ1' గ్రేడ్స్ వారిగా తెలుగు-15, హిందీ-11, ఇంగ్లీష్-14, మాథ్స్-18, సైన్స్-5, సోషల్-10. వందకు వందశాతం మార్కులను సాధించడం ఎంతో గొప్ప విషయం అన్నారు. గడచిన 3 సంవత్సరాలలో 2 సార్లు 100 శాతం ఉత్తీర్ణత సాధించిన ఘనత విశ్రా పాఠశాల విద్యార్థులకు దక్కుతుందన్నారు. 

ఈ సందర్భంగా   అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంధికీ, విద్యార్థులకు, తల్లిదండ్రులకు విశ్రా విద్యాసంస్థల డైరెక్టర్ దోర్బల హరిహరనాథ శర్మ, ప్రిన్సిపల్ దూడపాక సురేష్ అభినందనలు తెలియజేశారు.

Advertisement

Latest News

ఎక్సైజ్ శాఖకే వన్నె తెచ్చిన వ్యక్తి కమలాసన్ రెడ్డి.. కమిషనర్ హరికిరణ్ ఎక్సైజ్ శాఖకే వన్నె తెచ్చిన వ్యక్తి కమలాసన్ రెడ్డి.. కమిషనర్ హరికిరణ్
ఎక్సైజ్ శాఖలో  కమలాసన్ రెడ్డి దగ్గర పని చేయడం ఎంతో గర్వాంగా ఉందని  కమిషనర్ సి హరికిరణ్ అన్నారు. చాలామంది పోలీస్ ఆఫీసర్లతో పని చేసే అవకాశం...
నేరాల నియంత్రణకు సిసి కెమెరాలు ఎంతో ఉపయోగపడతాయి. నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెర్మల్
మిస్ వరల్డ్ 2025 కార్యక్రమంపై సైబరాబాద్ కమిషనరేట్ లో భద్రతా సమన్వయ సమావేశం
పదో తరగతి ఫలితాల్లో విశ్రా విద్యార్థుల విజయకేతనం..!
సిటీ పోలీస్ కమిషనరేట్ పునః వ్యవస్థీకరణలో కొత్త నిర్ణయాలు
భూదాన్ భూముల కేసులో సీనియర్ ఐపీఎస్ లకు చుక్కెదురు..!
స్పేస్ లో చేపల పెంపకం..