మున్సిపల్ కార్మికుల పెండింగ్ జీతాలు చెల్లించాలని బీజేపీ ధర్నా
By Ravi
On
మేడ్చల్ జిల్లా: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ సానిటేషన్ సిబ్బందికి గత మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని తెలుసుకున్న బీజేపీ నాయకులు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.బాచుపల్లి మండల అధ్యక్షులు ప్రసాద్ రాజు మాట్లాడుతూ వేతనాలు రాక ఖర్చులకి ఇబ్బంది పడుతున్న కార్మికులకు అండగా ఉంటామని చెప్పారు.ఈ రోజు సాయంత్రం వరకు కార్మికులకు వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో కార్మికుల పక్షాన పోరాటం కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో పార్లమెంట్ మీడియా సెల్ కన్వీనర్ సుమన్ రావు ఎస్సీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి దాసి నాగరాజు,కార్యవర్గ సభ్యులు గజ్జెల్లి సంతోష్ కుమార్ బిజెపి నాయకులు సురేష్,సైదులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
Latest News
28 Apr 2025 21:05:26
గ్రూప్1 పిటీషనర్లకు హైకోర్టు జరిమానా విధించింది. తప్పుడు ప్రమాణపత్రాలతో తప్పుదోవ పట్టించారన్న జస్టిస్ నగేష్ భీమపాక, పిటీషనర్లకు 20వేల జరిమానా విధించి తప్పుడు అఫిడవిట్లు దాఖలు చేసిన...