హైదరాబాద్ పై చెన్నైదే విజయం..!
ఐపీఎల్ 2025లో భాగంగా ఈరోజు రాత్రి చెపాక్ స్టేడియంలో చెన్నై, హైదరాబాద్ టీమ్స్ పోటీ పడబోతున్నాయి. ఈ సీజన్లో రెండు జట్లు ఎనిమిదేసి మ్యాచ్ లు ఆడి.. 2 విజయాలు, 6 పరాజయాలను నమోదు చేసుకున్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఎస్ఆర్హెచ్ తొమ్మిదో స్థానంలో ఉండగా.. సీఎస్కే అట్టడుగున పదో స్థానంలో ఉంది. ప్లేఆఫ్స్కు చేరాలంటే మిగిలిన అన్ని మ్యాచ్ల్లోనూ ఈ రెండు జట్లకు విజయం తప్పనిసరి. ఈ నేపథ్యంలో సీఎస్కే, ఎస్ఆర్హెచ్ జట్లకు ఈ మ్యాచ్ కీలకంగా మారింది. మరి ఈ మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారో చూడాలి. మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా మాజీ క్రికెటర్ సంజయ్ బంగర్ జోస్యం చెప్పారు. చెపాక్లో ఎస్ఆర్హెచ్పై సీఎస్కేదే విజయం అని పేర్కొన్నారు.
హైదరాబాద్పై చెన్నై గెలుస్తుందని నేను భావిస్తున్నా. అందుకు కారణం చెన్నై స్పిన్ విభాగం చాలా బలంగా ఉండడమే. చెన్నై గత మ్యాచుల ఫలితాలను మరిచి.. ముందుకు సాగాలి. జట్టులోని కుర్రాళ్లపై ఎక్కువగా దృష్టి పెట్టాలి. ఈ సీజన్లో హైదరాబాద్ నిలకడ లేకుండా ఆడుతోంది. ఇదే ఆ జట్టు కూటములకు మెయిన్ రీజన్. దూకుడుగా ఆడే ప్లేయర్లు ఉన్నా.. విఫలం అవుతున్నారు. కీలక ఆటగాళ్ల వైఫల్యమే ఎస్ఆర్హెచ్ను వెంటాడుతోంది అని సంజయ్ బంగర్ చెప్పారు. మరి ఈ జోస్యం నిజమవుతుందా లేదా అనేది తెలియాలంటే కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.