చెట్టుకిందే మల్కాజిగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం.. వినూత్న నిరసన తెలిపిన మర్రి రాజశేఖర్ రెడ్డి

By Ravi
On
చెట్టుకిందే మల్కాజిగిరి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం.. వినూత్న నిరసన తెలిపిన మర్రి రాజశేఖర్ రెడ్డి

మల్కాజిగిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లేకపోవడం వలన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడానికి వినూత్నంగా నిరసన తెలిపారు స్థానిక ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి. జిహెచ్ఎంసి కార్యాలయం ఎదుట ఉన్న చెట్టు కింద కూర్చొని ప్రజలతో కలిసి ఎమ్మెల్యే ప్రజా సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేలా ఒక శాశ్వత క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ఇప్పటికే ఎన్నిసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా, అధికారుల వద్ద విజ్ఞప్తులు చేసినా ఎలాంటి స్పందన లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చివరికి చెట్టు కిందే తాత్కాలికంగా క్యాంపు కార్యాలయాన్ని ఏర్పాటు చేసి ప్రజల సమస్యలు స్వయంగా విని పరిష్కరించేందుకు చర్యలు చేపట్టారు. తమ బాధలు చెప్పుకునేందుకు ఎక్కడికి వెళ్లాలో తెలియక సందిగ్ధంలో ఉన్న మల్కాజిగిరి ప్రజలకు ఇది కొంత ఊరట కలిగించిన విషయమైంది. ప్రభుత్వం తక్షణమే మల్కాజిగిరి నియోజకవర్గానికి శాశ్వత క్యాంపు కార్యాలయం ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

యజమానిని కరిచి చంపిన పెంపుడు కుక్క.. దర్యాప్తు చేస్తున్న మధురానగర్ పోలీసులు యజమానిని కరిచి చంపిన పెంపుడు కుక్క.. దర్యాప్తు చేస్తున్న మధురానగర్ పోలీసులు
మధురానగర్ లో తీవ్ర కలకలం రేగింది. పెంపుడు కుక్క కరిచి వ్యక్తి మృతి చెందడంటూ ప్రచారం జరగడంతో జనం ఆ ఇంటికి పోటెత్తారు. స్థానిక ప్రాంతంలో ఉన్న...
బాలాపూర్ లో కిరాణా షాప్ యజమాని కిడ్నాప్ కలకలం
ప్యాట్నీ సెంటర్ ఎస్బీఐ అడ్మినిస్ట్రేషన్ భవనంలో భారీ అగ్నిప్రమాదం
దుండిగల్ రెవెన్యూ అధికారులకు షాకిచ్చిన తండా యువకులు
అల్వాల్ లో దారుణం.. వృద్ధ దంపతుల హత్య
సుభాష్ నగర్ లో అపార్ట్మెంట్ పై నుండి దూకి వివాహిత ఆత్మహత్య
ఎరక్కపై ఇరుక్కున్న యూట్యూబర్ అన్వేష్.. ప్రపంచ యాత్రికుడిపై కేసు నమోదు