రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ కి ఆ హీరో గ్రీన్ సిగ్నల్..
డైరెక్టర్ ఎస్ఎస్.రాజమౌళి ప్రజంట్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో కలిసి SSMB29 లాంటి భారీ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్తో మేకర్స్ రూపొందిస్తు్న్నారు. అయితే, రాజమౌళి పలు ఇంటర్వ్యూల్లో తన డ్రీమ్ ప్రాజెక్ట్గా మహాభారతం సినిమాని తెరకెక్కించాలని ఉందంటూ చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. ఎప్పటికైనా ఈ ఎపిక్ సినిమాని రూపొందించాలని ఆయన అన్నారు. అయితే, ఇప్పుడు రాజమౌళి ప్రమేయం ఏమీ లేకుండానే మహాభారతం రూపొందనుంది.
బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ త్వరలోనే మహాభారత్ ను గ్రాండ్ గా తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపాడు. ఓ ఇంటర్వ్యూలో ఆయన స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ ఏడాది చివరినాటికి ఈ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ను స్టార్ట్ చేయబోతున్నట్లు కూడా ఆయన తెలిపారు. ఈ సినిమాను తాను ప్రొడ్యూస్ చేయబోతున్నట్లు.. క్యాస్టింగ్, డైరెక్టర్ ఎవరనేది ఇప్పుడే చెప్పలేదని ఆయన తెలిపారు. రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ను ఇప్పుడు అమీర్ ఖాన్ స్టార్ట్ చేయనుండటంతో ఈ ఎపిక్ మూవీ ఎలా ఉండబోతుందా అనేది ఆసక్తికరంగా మారింది.