కడప జిల్లాలో పిడుగు పడి యువకుడు మృతి..!
By Ravi
On
కడప జిల్లా పెద్దముడియం మండలం చిన్నముడియంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పిడుగు పాటుకు దండు బాను ఓబులేసు (24) అనే యువకుడు మృతిచెందాడు. తన పొలంలో కొర్ర పంటకు నీరు కట్టేందుకు వెళ్లినప్పుడు పిడుగు పడటంతో ఓబులేసు మృతిచెందాడు. మృతుడు ఎస్ ఉప్పలపాడులో నివాసం ఉంటున్నట్లు సమాచారం. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఓబులేసు మృతితో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు.
Related Posts
Latest News
29 Apr 2025 17:12:38
ఆడుకుంటూ ప్రమాద వశాత్తు సరూర్ నగర్ చెరువు లో పడి అభిత అనే 6 ఆరు సంవత్సరాల చిన్నారి మృతి చెందింది. చెరువు చుట్టు పెన్సిగ్ లేకపోవడంతో...