దూల్పేట్లో 2.3 కేజీల గంజాయి పట్టివేత..!
By Ravi
On
హైదరాబాద్ దూల్పేట్ పురానాపూల్లోని ఒక ఇంట్లో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయని సమాచారం మేరకు ఎస్టీఎఫ్ఏ పోలీసులు దాడి చేసి 1.2 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో చంద్రముఖి, ఆకాష్ సింగ్లను అరెస్ట్ చేసినట్లు ఎస్టీఎఫ్ఏ టీమ్ లీడర్ అంజిరెడ్డి తెలిపారు. గంజాయితోపాటు నిందితులను దూల్పేట ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు. మరో కేసులో 1.16 కేజీల గంజాయిని పట్టుకున్నారు. అసిఫ్ నగర్ బాలాజీ బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో గంజాయి అమ్మకాలు జరుపుతున్న మహమ్మద్ అఫ్జల్, అమిత్ను ఎస్టీఎఫ్డీ టీమ్ పట్టుకుంది. నిందితుడి నుంచి 1.16 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్టీఎఫ్డీ టీమ్ లీడర్ తిరుపతి యాదవ్ తెలిపారు. గంజాయిని, నిందితుడిని స్థానిక ఎక్సైజ్ స్టేషన్లో అప్పగించారు.
Related Posts
Latest News
20 Apr 2025 21:52:53
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాలని పలువురు ఆకాంక్షించారు. నారా చంద్రబాబు నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని రాజేంద్రనగర్ సర్కిల్లోని మైలార్ దేవ్...