రెండు కేసుల్లో 2.366 కేజీల గంజాయి పట్టివేత

By Ravi
On
రెండు కేసుల్లో 2.366 కేజీల గంజాయి పట్టివేత

హైదరాబాద్: నగరంలో మాదకద్రవ్యాల వ్యాపారంపై పోలీసుల దాడులు కొనసాగుతున్నాయి. రెండు వేర్వేరు ఘటనల్లో మొత్తం 2.366 కేజీల గంజాయిను ఎస్‌టిఎఫ్ (STF) పోలీసులు పట్టుకున్నారు.దూల్‌పేట్ ప్రాంతంలోని పురాణపూర్‌లో గంజాయి విక్రయం జరుగుతున్నట్టు వచ్చిన సమాచారం ఆధారంగా ఎస్‌టిఎఫ్-ఎ టీం సదరు ఇంటిపై దాడి చేసింది. ఈ దాడిలో 1.206 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నారు.ఈ కేసులో చంద్రముఖి మరియు ఆకాశ్ సింగ్లను అరెస్ట్ చేసినట్టు ఎస్‌టిఎఫ్-ఎ టీం లీడర్ అంజిరెడ్డి తెలిపారు. నిందితులు మరియు గంజాయిని దూల్‌పేట్ ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు.ఇక మరో కేసులో, అసిఫ్‌నగర్ బాలాజీ బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో గంజాయి విక్రయాలు చేస్తున్న మహమ్మద్ అఫ్జల్ అమీత్ అనే వ్యక్తిని ఎస్‌టిఎఫ్-డి టీం అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద 1.160 కేజీల గంజాయిను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్‌టిఎఫ్-డి టీం లీడర్ తిరుపతి యాదవ్ వెల్లడించారు. నిందితుడు, మాదకద్రవ్యం కలిపి స్థానిక ఎక్సైజ్ స్టేషన్కు అప్పగించారు.

Advertisement

Latest News

మైలార్ దేవులపల్లిలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు మైలార్ దేవులపల్లిలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు సంతోషంగా ఉండాల‌ని ప‌లువురు ఆకాంక్షించారు. నారా చంద్ర‌బాబు నాయుడు జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని రాజేంద్రనగర్ సర్కిల్‌లోని మైలార్ దేవ్...
క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో వ్యక్తి మృతి..! 
దూల్‌పేట్‌లో 2.3 కేజీల గంజాయి పట్టివేత..!
విద్యుత్‌ తీగలు తెగిపడి వ్యక్తి మృతి..!
జపాన్‌లో కొనసాగుతున్న రేవంత్‌ టీమ్‌ టూర్‌
రెండు కేసుల్లో 2.366 కేజీల గంజాయి పట్టివేత
అవినీతిమయంగా ఏపీ మార్కెటింగ్‌శాఖ..!