మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..

By Ravi
On
మారథాన్‌లో మనుషులతో పాటు రోబోలు..

ప్రస్తుతం ప్రపంచం అంతా టెక్నాలజీతో పరుగులు పెడుతుంది. ఇది ప్రజల జీవితాలను ఎంతో ఈజీ చేస్తోంది. ఇప్పటికే వార్తలు చదివే రోబో... హోటళ్లల్లో సర్వ్ చేసే రోబో, ఇంటి పనులకో రోబోలను మనం చూశాం. ఇక లేటెస్ట్ గా మారథాన్‌లో మనుషులతో పోటీపడే రోబోలు వచ్చేశాయి. చైనాలో జరిగిన హాఫ్‌, మారథాన్‌లో ఈ రోబోలను మనం చూడొచ్చు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. రోబోటిక్స్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ వంటి రంగాల్లో చైనా తన ఆధిపత్యాన్ని సాధించాలని చూస్తోంది.

దీనికి తగ్గట్లుగానే అక్కడ టెక్నాలజీ అడుగులు వేస్తూ అందర్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ క్రమంలో బీజింగ్‌ లో యిజువాంగ్‌ హాఫ్‌, మారథాన్‌ ను నిర్వహించారు. ఈ మారథాన్‌లో 21 కిలోమీటర్లు పరుగులు పెట్టేందుకు వేలాదిమంది రన్నర్లతో పాటు 21 రోబోలు కూడా పోటీపడ్డాయి. ఈ పోటీకి కొన్ని వారాల ముందే వీటిని పరీక్షించి మరీ బరిలోకి దింపినట్లు ఆ దేశ మీడియా సంస్థలు వెల్లడిస్తున్నాయి. చైనా దేశంలో గతంలో జరిగిన అనేక మారథాన్‌లలో రోబోలు కనిపించాయి. అయితే, మనుషులతో కలిసి పోటీపడటం మాత్రం ఇదే ఫస్ట్ టైమ్. దీంతో నెటిజన్లు సర్ ప్రైజ్ ఫీల్ అవుతూ.. ఇక మున్ముందు ఇంకెన్ని వింతలు చూడాల్సి వస్తుందోనని కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Latest News

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..! జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..!
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..!
స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్‌రెడ్డి
శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చెప్పుల దండ..!
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై రఘునందన్‌రావు ఫైర్‌
హైదరాబాద్‌ మారేడ్‌పల్లిలో చైన్ స్నాచింగ్‌..!
తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ హర్షం