ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్ధాల‌తో పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ప్ర‌మాదం..!

By Ravi
On
ఎల‌క్ట్రానిక్ వ్య‌ర్ధాల‌తో పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ప్ర‌మాదం..!

విజయనగరం TPN : ఇళ్లు, కార్యాల‌యాలు, వాణిజ్య, వ్యాపార సంస్థ‌ల్లో పాడైన ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు, వ‌స్తువుల‌ను శాస్త్రీయ ప‌ద్ధ‌తుల్లో తొల‌గించ‌డం ఎంతో ముఖ్య‌మని ఉత్త‌రాంధ్ర జిల్లాల ప్ర‌త్యేక అధికారి, రాష్ట్ర వ్య‌వ‌సాయ‌, ఉద్యాన‌శాఖ‌ల ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి రాజశేఖ‌ర్ సూచించారు. ఈ వ్య‌ర్ధాల‌ను స‌రైన రీతిలో తొల‌గించ‌క‌పోతే వాటి నుంచి వెలువ‌డే ర‌సాయ‌నాలు పిల్ల‌లు, గ‌ర్భిణీల‌కు ఎంతో ప్ర‌మాద‌క‌రంగా ప‌రిణ‌మిస్తాయ‌ని చెప్పారు. ఈ-వ్య‌ర్థాల‌ను శాస్త్రీయ విధానంలో తొల‌గించ‌న‌ట్ల‌యితే వాటి నుంచి వెయ్యి ర‌కాల ప్ర‌మాద‌క‌ర ర‌సాయ‌నాలు వెలువ‌డ‌తాయ‌ని.. వాటిని పీల్చిన గ‌ర్భిణీల‌కు, వారి గ‌ర్భంలోని శిశువుకు ఇవి ఎంతో హాని క‌లిగిస్తాయ‌న్నారు. ప్ర‌జ‌ల్లో ఈ-వ్య‌ర్థాలపై అవ‌గాహ‌న త‌క్కువ‌గా వుంద‌ని.. అందుకే రాష్ట్ర ప్ర‌భుత్వం స్వ‌ర్ణాంధ్ర - స్వ‌చ్ఛాంధ్ర కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, వాటిని సేక‌రించి శాస్త్రీయ ప‌ద్ధ‌తుల్లో తొల‌గించేందుకు ప్రాధాన్య‌త ఇస్తోంద‌న్నారు. విజయనగరం పాల‌క‌సంస్థ ఆధ్వ‌ర్యంలో ఈ-వ్య‌ర్ధాల‌పై న‌గ‌రంలో నిర్వ‌హించిన ర్యాలీలో జోన‌ల్ ప్ర‌త్యేక అధికారి బి.రాజ‌శేఖ‌ర్, క‌లెక్ట‌ర్ అంబేద్క‌ర్ పాల్గొన్నారు. పైడిత‌ల్లి అమ్మ‌వారి ఆల‌యం నుంచి కోట వ‌ర‌కు నిర్వ‌హించిన ర్యాలీలో విద్యార్థులు, మ‌హిళ‌ల‌తో క‌ల‌సి పాల్గొన్నారు. అనంత‌రం కోట దగ్గర విద్యార్థులు, మ‌హిళ‌ల‌తో స్వ‌ర్ణాంధ్ర - స్వ‌చ్ఛాంధ్ర ప్ర‌తిజ్ఞ చేయించారు.

ఈ సంద‌ర్భంగా ప్ర‌త్యేక అధికారి రాజ‌శేఖ‌ర్ మాట్లాడుతూ.. ప్ర‌పంచ వ్యాప్తంగా 2022 నాటికి 8 కోట్ల ట‌న్నుల ఈ-వ్య‌ర్ధాలు వున్న‌ట్టు ప్ర‌పంచ ఆరోగ్య‌సంస్థ త‌న నివేదిక‌లో వెల్ల‌డించింద‌ని.. ఇందులో ఇర‌వై మిలియ‌న్ ట‌న్నులు మాత్ర‌మే రీసైక్లింగ్ జ‌రుగుతున్న‌ట్టు పేర్కొంద‌ని తెలిపారు. మిగిలిన ఈ-వ్య‌ర్థాల‌న్నీ అశాస్త్రీయ విధానంలోనే తొల‌గించ‌డం జ‌రుగుతోంద‌ని.. ఇది మాన‌వాళి మ‌నుగ‌డ‌కే ప్ర‌మాద‌క‌ర‌మ‌న్నారు. అభివృద్ధి చెందిన దేశాలు త‌మ దేశాల్లో ఉత్ప‌త్తి అయిన ఈ-వ్య‌ర్థాల‌ను అభివృద్ధి చెందుతున్న దేశాల్లోకి ఓడ‌ల ద్వారా పంపిస్తున్నాయ‌ని.. ఇది ఎంతో ఆందోళ‌న‌క‌ర‌మ‌న్నారు. ప్ర‌జ‌లు త‌మ ఇళ్ల‌లోని పాడైన ఎల‌క్ట్రానిక్ ప‌రిక‌రాలు, వ్య‌ర్థాల‌ను న‌గ‌ర పాల‌క‌సంస్థ ఏర్పాటు చేసిన ఈ-వ్య‌ర్థాల సేక‌ర‌ణ కేంద్రంలో అంద‌జేస్తే.. వాటిని స‌రైన రీతిలో రీసైక్లింగ్ చేసి ముప్పు లేకుండా తొల‌గించ‌డం జ‌రుగుతుంద‌న్నారు. ఈ-వ్య‌ర్థాల‌ను శాస్త్రీయంగా తొల‌గిస్తే వాటి నుంచి ఎంతో విలువైన బంగారం, వెండి, ప్లాటినం వంటి లోహాల‌ను వెలికితీయ‌వ‌చ్చ‌న్నారు.

Advertisement

Latest News

జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..! జేఈఈ మెయిన్స్‌లో ప్రతిభ చూపించిన గిరిజన విద్యార్థులకు మంత్రి సంధ్యారాణి అభినందనలు..!
జేఈఈ మెయిన్స్‌లో మంచి ర్యాంకులు సాధించిన గిరిజన గురుకులాల విద్యార్థులను రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి...
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్‌ హాట్‌ కామెంట్స్‌..!
స్వర్ణాంధ్ర -స్వచ్ఛాంధ్రే ప్రభుత్వ లక్ష్యం : బొజ్జల సుధీర్‌రెడ్డి
శ్రీకాళహస్తిలో రోజా దిష్టిబొమ్మకి చెప్పుల దండ..!
కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌పై రఘునందన్‌రావు ఫైర్‌
హైదరాబాద్‌ మారేడ్‌పల్లిలో చైన్ స్నాచింగ్‌..!
తెలంగాణ పోలీస్‌శాఖకు దేశంలోనే ప్రథమ స్థానం లభించడంపై డీజీపీ హర్షం