బీసీసీఐ షాకింగ్ డెసిషన్..
ఇండియన్ క్రికెట్ కంట్రోల్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్, ఫీల్డింగ్ కోచ్ దిలీప్ ను తప్పించారు. ఆస్ట్రేలియా వేదికగా జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ కారణంగా తొలగించు నిర్ణయం తీసుకున్నట్లు నేషనల్ మీడియా ద్వారా. ఆస్ట్రేలియాలో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-3 తేడాతో ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. ఈ ఎంపికనే బ్యాటింగ్ కోచ్గా వ్యవహరించిన అభిషేక్ నాయర్కు వీడ్కోలు పలకాలని నిర్ణయించినట్లు నివేదిక సూచించింది. అయితే, ఈ వ్యవహారంపై ఇప్పటి వరకు బీసీసీఐ అఫిషియల్ గా అనౌన్స్ చేయలేదు.
లేటెస్ట్ గా నాయర్ ను అసిస్టెంట్ కోచ్ బాధ్యతల నుంచి తప్పించింది. ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్తో పాటు స్ట్రెంట్ అండ్ కండిషనింగ్ కోచ్ సోహమ్ దేశాయ్లను సైతం తొలగించినట్లు తెలుస్తుంది. ఇక 2024 టీ20 ప్రపంచ కప్ తర్వాత రాహుల్ ద్రవిడ్ పదవీకాలం ముగిసిన బీసీసీఐ గంభీర్ను హెడ్ కోచ్గా నియమించారు. కోల్కతా నైట్రైడర్స్ జట్టుకు గంభీర్ మెంటార్గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఆ జట్టులో పని చేసిన అభిషేక్ నాయర్, ర్యాన్ టెన్ డోస్చాట్ను గంభీర్ సపోర్టింగ్ స్టాఫ్గా తీసుకున్నాడు. ఇదిలా ఉంటే నాయర్, దిలీప్ స్థానంలో ఎవరిని నియమిస్తారన్నది తెలియలేదు.