సూడాన్‌లో 300 మంది పౌరులు మృతి

By Ravi
On
సూడాన్‌లో 300 మంది పౌరులు మృతి

సూడాన్ దేశంలో సైన్యం, పారామిలిటరీకి మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. తాజాగా ఈ రెండు దళాలకు మధ్య విభేదాలతో మరోసారి ఈ ప్రాంతం అతలాకుతలం అయ్యింది. గత రెండేళ్లుగా జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా జరిగిన ఘటనలో కూడా దాదాపు 300 మంది ప్రాణాలు కోల్పోయారు. పలు శిబిరాలపై శుక్ర, శనివారాల్లో పారామిలిటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాలు తీవ్ర దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 300 మందికిపైగా పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు ఐక్యరాజ్యసమితి మానవతా సంస్థ అధికారికంగా తెలిపింది.

మృతుల్లో 20 మంది పిల్లలు కూడా ఉన్నట్లు పేర్కొంది. ఈ దాడుల్లో అనేక మంది గాయపడినట్లు నివేదికలు జారీ చేసింది. కాగా, ప్రపంచంలోని అతి పేద దేశాల్లో సూడాన్‌ ఒకటి. 2023 ఏప్రిల్ 15న సూడాన్ సాధారణ మిలిటరీ, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ అని పిలిచే పారామిలిటరీ బలగాల మధ్య యుద్ధం స్టార్ట్ అయ్యింది. కాగా నేటికి ఈ ప్రాంతంలో రెండు వర్గాలుగా విడిపోయిన సైనిక కమాండర్లు అధికారం కోసం ఒకరి మీద మరొకరు దాడులు చేసుకుంటున్నారు. ఈ దాడుల్లో ఇప్పటి వరకూ 30 వేల మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!