యూనస్‌కి హసీనా హెచ్చరిక..

By Ravi
On
యూనస్‌కి హసీనా హెచ్చరిక..

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా, టెంపరరీ దేశాధినేత మహ్మద్ యూనస్‌కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఆయనను విదేశాలతో కలిసి దేశ పతనానికి కుట్ర పన్నిన స్వార్థపరుడైన రుణగ్రహీతగా కామెంట్ చేశారు. విద్యార్థి నిరసనకారుడు అబూ సయీద్‌ను చంపిన దానిపై కూడా ఆమె సందేహాలను లేవనెత్తారు. 8 నిమిషాల వర్చువల్ ప్రసంగంలో ఆమె యూనస్‌పై ధ్వజమెత్తారు. తాజాగా తన మద్దతుదారుల్ని ఉద్దేశించి మాట్లాడారు. బంగ్లాదేశ్ చరిత్ర, స్వాతంత్య్ర ఉద్యమం అవామీ లీగ్‌తో ముడిపడి ఉందని, యూనస్ వీటిని తుడిపెట్టాలని అనుకుంటున్నాడని ఆమె ఆరోపణలు చేశారు. కాగా స్వాతంత్య్ర ఉద్యమకారుల పేరిట నిర్మించిన భవనాలు తగలబెడుతున్నారని, నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని, అది మీకే ప్రమాదమని హెచ్చరించారు. 

కాగా బంగ్లాదేశ్ ను నాశనం చేయాలనుకుంటే విదేశీ కుట్రదారులతో యూనస్ కలిశారని ఆరోపించారు. ఈ క్రమంలో దేశాన్ని నాశనం చేయడానికే విదేశీ నిధుల్ని ఉపయోగిస్తున్నారని అన్నారు. తమ పాలన ముగియడం బంగ్లాదేశ్ పరిశ్రమలకు షాక్‌ ని ఇచ్చిందని, వేలాది కర్మాగారాలు మూతపడ్డాయని, అవామీ లీగ్‌తో సంబంధం ఉన్న కర్మాగారాలు కాలిపోయాయని, హోటళ్లు, ఆస్పత్రులు ప్రతీదాన్ని నాశనం చేస్తున్నారని హసీనా, యూనస్ ప్రభుత్వంపై మండిపడ్డారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!