పసిబిడ్డల్ని అమ్ముతున్న ముఠా అరెస్ట్..

By Ravi
On
పసిబిడ్డల్ని అమ్ముతున్న ముఠా అరెస్ట్..

అప్పుడే పుట్టిన పిసిబిడ్డల్ని అపహరించి, అమ్ముతున్న ముఠాను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ కేస్ లో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. నిందితుల నుండి నాలుగు రోజులు వయస్సున్న ఇద్దరు చిన్నారుల్ని రక్షించినట్లుగా పేర్కొన్నారు. కాగా పోలీసుల వివరాల ప్రకారం.. గుజరాత్, రాజస్థాన్ తో పాటు ఢిల్లీలోని పలు ప్రాంతాల్లోని ప్రభుత్వ హాస్పిటల్స్ ను లక్ష్యంగా ఉంచి ఈ ముఠా ఈ పనులు చేస్తుంది. ఇప్పుటి వరకు దాదాపు ఈ ముఠా 35 మంది చిన్నారులను అమ్మివేసింది. కాగా ద్వారకా జిల్లాలోని ఉత్తమ్‌ నగర్‌ లో కొందరు వ్యక్తులు ఓ శిశువును విక్రయించడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. 

కాగా ఈ ముఠా అపహరించిన శిశువులను ఢిల్లీ చుట్టుపక్కల ఉన్న మురికివాడల్లో ఉంచి.. పిల్లలు లేని ధనవంతులకు వారిని రూ.5 నుంచి రూ.10 లక్షలకు విక్రయిస్తున్నారు. వారి నుంచి ఇద్దరు నవజాత శిశువులను కాపాడామని, చిన్నారులు గుక్కపట్టి ఏడుస్తున్నా పట్టించుకోకుండా నిందితులు వారి విక్రయానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. మురికివాడల్లోనే కాకుండా దేశ రాజధానిలోని ధనవంతుల నివాస ప్రాంతాల్లో కూడా ఈ ముఠాకు విస్తృతమైన నెట్‌వర్క్ ఉందని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ రాకెట్‌లో కొందరు వైద్యుల సహకారం కూడా ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Tags:

Advertisement

Latest News

హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!! హఠాత్తుగా మూతపడిన జిందాల్ పరిశ్రమ..! ఆందోళన బాటలో కార్మికులు..!!
విజయనగరం TPN : కొత్తవలస మండలంలోని అప్పన్నపాలెం దగ్గరున్న జిందాల్ స్టెయిన్ లెస్ స్టీల్ పరిశ్రమ దశాబ్దాలుగా నడుస్తూ వందలాది మంది కార్మికులకు జీవనోపాధిగా నిలిచింది. అయితే...
టీజీఎస్ఆర్టీసీ ఆస్పత్రిలో క్యాథ్ ల్యాబ్, 12 బెడ్ల ఎమ‌ర్జెన్సీ కేర్ యూనిట్..!
దోమల వ్యాప్తి నిర్మూలనలో డ్రైడే పద్ధతి ఉత్తమం :. డాక్టర్ జగన్‌మోహన్‌రావు
అంజన్‌కుమార్‌యాదవ్‌ వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేతల ధర్నా..!
మే 7 నుంచి ద్వారకా తిరుమలేశుని కల్యాణోత్సవాలు..!
కాచిగూడ రైల్వే మ్యూజియంలో ఘనంగా వరల్డ్ హెరిటేజ్ డే..!
హైదరాబాద్‌ సిటీలో అర్ధరాత్రి దొంగల హల్‌చల్‌..!