ఒరిస్సా పూరీ ఆలయంలో హఠాత్ పరిణామం..

By Ravi
On
ఒరిస్సా పూరీ ఆలయంలో హఠాత్ పరిణామం..

ఒడిశా రాష్ట్రం పూరీలోని ప్రముఖ జగన్నాథ ఆలయంలో ఊహించని ఘటన చోటు చేసుకుంది. ఈ ఆలయాన్ని భక్తులు ఎంతో పవిత్రంగా చూస్తారు. కాగా ఈ ఆలయం శిఖరంపై ఉన్న నీలచక్రంపై ఎగిరే జెండాను ఓ గద్ద ఎత్తుకెళ్లిపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. గోపురంపై ఉన్న జెండాను గద్ద తన నోట కరిచి ఆలయం చుట్టూ చక్కర్లు కొట్టింది. ఆ తర్వాత సముద్రంవైపు వెళ్లిపోయింది. ఇది చూసిన భక్తులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కొందరు ఆ దృశ్యాలను తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా ఆ వీడియో వైరల్‌ అవుతోంది. 

కాగా ఆదివారం సాయంత్రం 5 గంటల సమయంలో ఈ ఘటన జరిగిందని స్థానికులు తెలిపారు. అయితే, ఈ ఘటనపై ఆలయ అధికారులు ఎలాంటి అధికారిక ప్రకటనా చేయకపోవడం గమనార్హం. కాగా, పూరీకి వచ్చే భక్తులంతా మొదటగా ఈ జెండా దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత ఆలయంలో జగన్నాథుడి దర్శనం కోసం వెళ్తారు. ఆలయ శిఖరంపై ఎగురవేసే 14 మూరల పతాకాన్ని అర్చకులు ప్రతిరోజూ మారుస్తారు. సాయంత్రం 5 గంటలకు కొత్త జెండా ఎగురవేస్తారు. భక్తులు సమర్పించే జెండాలను చక్రం దిగువన కడతారు. కాగా పూరీలోని ఈ జెండాకు సైతం విశిష్టత కలిగి ఉంది.

Advertisement

Latest News

కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..! కార్ఖానాలో అక్కాచెల్లెళ్ల ఆత్మహత్య..!
హైదరాబాద్‌ కార్ఖాన పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఓ ప్లాట్‌లో అక్కాచెల్లెళ్లు మృతిచెందిన ఘటన కలకలం రేపింది. సకాలంలో వివాహం కాకపోవడంతోపాటు ఇద్దరి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో మనస్తాపానికి...
కడప, అన్నమయ్య జిల్లాల్లో ఈదురుగాలులు.. వడగళ్ల బీభత్సం..!
ఎస్టీ, ఎస్సీ భూములపై కన్నేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..?
బుధవారం శ్రీకాకుళం ఎమ్మెల్యే  పల్లెనిద్ర..! 
3 దశాబ్దాల కలని సాకారం చేసిన ఎమ్మెల్యే ఎంజీఆర్‌..!
ఏసీబీ వలలో బయోడైవర్సిటీ డిప్యూటీ డైరెక్టర్‌..!
వైద్యుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి..!