300 ఏళ్ల చరిత్ర గల ఎండల మల్లికార్జున స్వామి ఆలయంపై క్రైస్తవ మత రాతలు
TPN RAJASEKHAR SRIKAKULAM
Date - 02/04/25
రెండు రోజులు క్రితం శ్రీకాకుళం జిల్లాలో 300 ఏళ్ల చరిత్ర ఉన్న ఎలమంచిలిలోని ఎండల మల్లిఖార్జునస్వామి ఆలయంతో పాటు సమీప గ్రామాల్లోని హనుమాన్ ఆలయాలపై క్రైస్తవ మతానికి సంబంధించిన రాతలు, శిలువ గుర్తులు దర్శనమిచ్చాయి. ఎండల మల్లికార్జున స్వామి ఆలయానికి చేరుకున్న సాధుపరిషత్ అధ్యక్షులు శ్రీనివాసానంద సరస్వతి, RSS, VHP ప్రతినిధులు ఈ దారుణంపై మండిపడుతున్నారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే మతాల మధ్య చిచ్చు రేపుతున్నారని.. వారిని అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆలయ గోడలపై ఉన్న అన్యమతాలకు చెందిన గుర్తులు, రాతలు చెరిపివేసే ప్రయత్నం చేసారు . తరువాత జలుమూరు మండలం లోని మార్చి 29 తేది రాత్రీ వివిధ ఆలయల గోడలు పై రాసిన రాతలు కు సంబంధించిన వ్యక్తులు వివరాలు తెలియజేసిన వారికి 25 వేలు రూపాయలు నగదు పురస్కారాన్ని బహుమతి ప్రధానం చేయబడుతుంది జిల్లా ఎస్పీ శ్రీ కెవి మహేశ్వర రెడ్డి ఐపీఎస్ గారు మంగళవారం సాయంత్రం ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఆలయాల గోడల పై రాసిన రాతలుకు సంబంధించిన వ్యక్తులు వివరాలు తెలియజేసి ప్రజలు పోలీసు వారికి సహాయ సహకారాలు అందించాలని అట్టి వివరాలు తెలియజేసిన వ్యక్తుల వివరాలని గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
సంప్రదించవల్సిన ఫోన్ నెంబర్లను.
జిల్లా ఎస్పీ 6309990800.
అదనపు ఎస్పీ క్రైమ్స్.. 6309990803,
శ్రీకాకుళం టౌన్ డిఎస్పీ.. 6309990804
నరసన్నపేట సీఐ 6309990815,
జలుమూరు ఎస్సై 6309990848
ఎస్బి సీఐ 6309990886.