కుత్బుల్లాపూర్: మద్యం మత్తులో యువకుల వీరంగం
By Ravi
On
కుత్బుల్లాపూర్:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, పెట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మద్యం మత్తులో యువకులు ఘోర వీరంగం సృష్టించారు.
సుచిత్ర చౌరస్తాలో మద్యం తాగిన యువకులు, అనుకున్నంత మేరకు గడప లేకుండా ఎర్టిగా టీఎస్ 08 హెచ్ఎం 6704 వాహనంతో ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో, వాహనం 50 మీటర్ల దూరం వరకు ద్విచక్ర వాహనాన్ని తివ్వుతూ వెళ్లింది. ఈ ఘటనలో ద్విచక్ర వాహనదారులు తీవ్ర గాయాల పాలయ్యారు.
ప్రత్యక్ష సాక్షుల ప్రకారం, ఘటనను గమనించిన స్థానికులు యువకులను పట్టుకొని, పోలీసులకు అప్పగించారు. ఈ సమయంలో యువకులు బూతులు తిడుతూ, పోలీసులతో వాగ్వాదం జరిపారు. అనంతరం, పోలీసులు వారిని పోలీసు స్టేషన్కు తరలించారు.
ప్రస్తుతానికి, ఈ ఘటనపై కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Tags:
Latest News
15 Apr 2025 19:41:24
ఈదురు గాలుల దాటికి నేలరాలిన అరటి...మామిడి
వడగండ్లతో తడిచిపోయిన ధాన్యం
పులివెందుల నియోజకవర్గంలోనే రూ.10 కోట్ల మేర నష్టం
గాలుల బీభత్సానికి కొట్టుకుపోయిన షెడ్లు