పెద్ద మొత్తంలో ఢిల్లీ ఫారెన్ లిక్కర్ పట్టివేత..

By Ravi
On
పెద్ద మొత్తంలో ఢిల్లీ ఫారెన్ లిక్కర్ పట్టివేత..

 * రూ. 22 లక్షల మద్యం, నగదు కారు స్వాధీనం.

 * ఐదుగురుపై కేసు నమోదు..

 * ఇద్దరు వ్యక్తుల అరెస్టు

* 233 బాటిల్స్  ఫారిన్ లిక్కర్ సీస్.

బషీర్బాగ్ కేఫ్ బాహర్ రెస్టారెంట్ సమీపంలో టాటా వాటర్ ఏజెన్సీ గోదాంలో ఢిల్లీకి చెందిన 233 ఫారిన్ లిక్కర్ బాటిల్ లను హైదరాబాద్ ఎన్ఫోర్స్ బీ టీం పట్టుకున్నారు.

174.5 లీటర్ల మద్యం, 24  రకాల 233 ఫారెన్ మద్యం బాటిల్లను ఎక్సైజ్ ఎన్ఫోర్స్ బి టీం సీఐ చంద్రశేఖర్ గౌడ్ టీం  పోలీసులు పట్టుకున్నారు.

 పట్టుకున్న మద్యం విలువ తెలంగాణ మద్యం ధరల ప్రకారం రూ.9,68,150 విలువ ఉంటుందని అంచనా వేశారు.

 మద్యం బాటిల్లతో పాటు ఒక కారును రూ. 35 వేల నగదును రెండు సెల్ఫోన్లను ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు.

 హరీష్ కుమార్ హిర్వాణి అనే వ్యక్తి గతలో మద్యం వ్యాపారిగా కొనసాగారు. 

గత టెండర్స్ లో మద్యం దుకాణం రాకపోవడంతో తనకున్నటువంటి టాటా వాటర్ గోదాములో ఢిల్లీ నుంచి ఫారెన్ లిక్కర్స్ తెప్పిస్తూ 14  నెలలుగా ఢిల్లీ నుంచి ఫారిన్ లిక్కర్స్ తెప్పించి బాటిల్ పై రూ. 1500 వందల నుంచి రూ.2000 రూపాయలు లాభాలను ఆర్జిస్తున్నట్లు విచారణలో వెల్లడయింది.

 ఈ సమాచారం అందుకున్న హైదరాబాద్ ఏసియన్ ఫోర్స్ బి టీం చంద్రశేఖర్ గౌడ్ టీం వాటర్ ప్లాంట్ గోదాంలో దాడి చేసి ఫారిన్ లిక్కర్ను స్వాధీనం చేసుకున్నారు.

 ఈ కేసులో దోమలగూడకు చెందిన ప్రధాన నిందితుడు హరికుమార్ ఈర్వాణి సికింద్రాబాద్ కు చెందిన విలియమ్స్ జోసెఫ్ లను అరెస్ట్ చేశారు.

 ఢిల్లీకి చెందినటువంటి మద్యం వ్యాపారులు దీపక్,ధర్మబట్టి, సునీల్ పై కూడా కేసులు నమోదు చేశారు.

 ఫారెన్ లిక్కర్ మద్యం బాటిల్లను ఇద్దరు వ్యక్తులను, కారును నగదును  అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ హైదరాబాద్ డిప్యూటీ కమిషనర్ కే. ఏ. బీ శాస్త్రి, ఎన్ఫోర్స్మెంట్ కమిషనర్ అనిల్ కుమార్ రెడ్డి, సీఐ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు. 
 ఫారెన్ లిక్కర్ను పట్టుకున్నటువంటి బృందంలో ఎన్ఫోర్స్ సిఐ ఎస్. చంద్రశేఖర్ గౌడ్, ఎస్సై ఎన్ శ్రీనివాస్, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున్, కానిస్టేబుళ్లు శ్రీకాంత్, సాయి కుమార్, ప్రసాద్, గోపాల్, నవీన్, తరుణి,రాజ్ ఠాకూర్ లో ఉన్నారు.

 ఎన్ డి పి ఎల్ మద్యం పట్టుకున్నటువంటి ఎన్ఫోర్స్ టీం కి టీం చంద్రశేఖర్ గౌడ్ ను టీం సభ్యులను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వి.బి. కమలహాసన్ రెడ్డి స్వయంగా పిలిచి అభినందించారు.

Tags:

Advertisement

Latest News

పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్ పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించండి – డాక్యుమెంట్ రైటర్స్ డిమాండ్
రిజిస్ట్రేషన్లకు సంబంధించి పాత పద్ధతినే కొనసాగించాలని ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్లాట్ బుకింగ్ వ్యవస్థను తీసివేయాలని డిమాండ్ చేస్తూ చంపాపేట్ డాక్యుమెంట్ రైటర్స్ సభ్యులు షాపులు బంద్...
27 కిలో మీటర్లు లక్షలాది జనం-కని విని ఎరుగని రీతిలో వీర హనుమాన్ శోభాయాత్ర
24 న భవన నిర్మాణ కార్మికుల ధర్నా
శ్రీకాళహస్తి రాజీవ్ నగర్ ఎస్టి కాలనీకి వాటర్ పైప్ లైన్ ఏర్పాటు – శాసనసభ్యుడు సుధీర్ రెడ్డి ఆదేశాల మేరకు చర్యలు
అక్షర చిట్ ఫండ్ మోసాలు: ధర్నా చౌక్‌లో బాధితుల ఆందోళన
అర్జీల పరిష్కార మార్గం నిజ నిర్థారణ చేసుకోవాలి.
తెలంగాణ అమరనాథ్‌ - సలేశ్వరం యాత్ర..