విజయవాడలో యోగ అవగాహన ర్యాలీలు – కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

On
విజయవాడలో యోగ అవగాహన ర్యాలీలు – కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు

విజయవాడ నగరపాలక సంస్థ
08-06-2025

 యోగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాలి 

 ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సచివాలయంలో ర్యాలీ జరగాలి

 

ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే సదుద్దేశంతో మొదలుపెట్టిన యోగాంద్ర కార్యక్రమం దిగ్విజయంగా నిర్వహించే క్రమంలో, యోగ వల్ల ప్రజలకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు  ప్రజలకు అవగాహన కల్పించేటట్టు నిర్వహించాలని  విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర అన్నారు.  ఆదివారం సాయంత్రం శాఖధిపతులు, స్పెషల్ ఆఫీసర్లు, సిబ్బంది తో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు.

 

 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరిస్తూ సోమవారం ఉదయం ప్రతి సచివాలయం  యోగా దాని వల్ల ప్రజలకు కలిగే ఆరోగ్య ప్రయోగాలు తెలియపరిచే విధంగా ప్రతి సచివాలయం పరిధిలో ర్యాలీ నిర్వహించాలని స్పెషల్ ఆఫీసర్లను ఆదేశించారు. ప్రజలను ప్రజాప్రతినిధులను భాగస్వామ్ చేస్తూ ఈ రాలిని నిర్వహించాలన్నారు.

 

 ప్రతి నియోజకవర్గంలో జోనల్ కమిషనర్లు ర్యాలీ నిర్వహించి ప్రజలకు యోగ  వల్ల కలిగే  ప్రయోజనాల గురించి  అవగాహన కల్పించాలని అన్నారు.  విజయవాడ నగర పాలక సంస్థ పరిధిలో ప్రధాన ర్యాలీ ఇందిరా గాంధీ మున్సిపల్స్ స్టేడియం కార్పొరేషన్ నుండి బెంజ్ సర్కిల్ వరకు జరగాలని అధికారులను ఆదేశించారు  అందుకు అనుగుణంగా  అన్నీ ఏర్పాట్లు చేయాలని  అధికారులను ఆదేశించారు.

 

 పౌర సంబంధాల అధికారి 
 విజయవాడ నగరపాలక సంస్థ

Advertisement

Latest News

నగరానికి వచ్చిన ప్రభాకర్ రావు.. ఎయిర్ పోర్ట్ లో భారీ స్కెచ్.. నగరానికి వచ్చిన ప్రభాకర్ రావు.. ఎయిర్ పోర్ట్ లో భారీ స్కెచ్..
70 మంది బౌన్సర్లను దింపిన కుటుంబ సభ్యులు మీడియా ప్రతినిధులపై దాడి.. ప్రభాకర్ రావు ఇంటి వరకు బౌన్సర్లతో సెక్యూరిటీ.. దాడిలో గాయపడ్డ పలువురు మీడియా ప్రతినిధులు ...
విజయవాడలో యోగ అవగాహన ర్యాలీలు – కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు
అమరావతిని కించపరిచే వ్యాఖ్యలపై ఎమ్మెల్యే విజయశ్రీ పోలీసులకు ఫిర్యాదు
తెప్పపై శోభాయాత్రలో శ్రీ సుందరరాజ స్వామి
ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన
సూళ్లూరుపేటలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన