బోరబండను కాపాడాలి అంటూ మాగంటి ఇంటి వద్ద మహిళల ఆవేదన..
By V KRISHNA
On
- కార్పొరేటర్ ఫసియుద్దీన్ పాపాలు అరికట్టాలని కేసీఆర్ కి వినతి..
- ఫసియుద్దీన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు.. సర్ది చెప్పిన కేటీఆర్..
మాగంటి గోపీనాథ్ ఇంటికి చేరుకున్న బోరబండకు చెందిన మహిళలు స్థానిక కార్పొరేట్, మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పై ఆగ్రహం వ్యక్తంచేశారు. నివాళులు అర్పించేందుకు వచ్చిన కేసీఆర్, హరీష్ రావు, కేటిఆర్ లను తమ బోరబండను కాపాడాలని నినాదాలు చేశారు. ఫసియుద్దీన్ అరాచకాలు అడ్డుకోవాలి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. కేటిఆర్ మాట్లాడుతూ ఇది సరైన సమయం కాదని నచ్చచెప్పారు. బిఆర్ఎస్ పార్టీలో కార్పొరేట్ గా గెలిచి డిప్యూటీ మేయర్ గా ఉండి పార్టీ మారిన ఫసియుద్దీన్ ఆగడాల వల్ల మాగంటి కుడిభుజంగా ఉన్న సర్దార్ ఆత్మహత్య చేసుకున్నాడని మహిళలు చెప్పారు. సర్దార్ ఆత్మహత్య మాగంటిని తీవ్రంగా కలచి వేసిందని, ఆయన మనోవేదనకు గురై ఆస్పత్రి పాలైనారని చెప్పుకొచ్చారు. పోలీసులు కూడా ఫసియుద్దీన్ కే వత్తాసు పలుకుతున్నారని మండిపడ్డారు.
Related Posts
Latest News
08 Jun 2025 22:49:51
విజయవాడ నగరపాలక సంస్థ08-06-2025
యోగ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ప్రజలకు తెలియజేయాలి
ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి సచివాలయంలో ర్యాలీ జరగాలి