నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మొదలైన చేపప్రసాదం పంపిణీ..

On
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మొదలైన చేపప్రసాదం పంపిణీ..

మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప ప్రసాదం మొదలైంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాలు దేశ విదేశాల నుండి ఆస్తమా వ్యాధి గ్రస్తులు లక్షల్లో ఎగ్జిబిషన్ వద్దకు చేరుకున్నారు. ఉదయం నుండి బత్తిని కుటుంబ సభ్యులు చేపప్రసాదం పంపిణీ చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుండి రేపు సోమవారం మధ్యాహ్నం వరకు ప్రసాదం పంపిణీ అవుతుందని తెలిపారు. ఎంతమంది వచ్చిన ప్రసాదంలో ఎలాంటి లోటు లేదని అన్నారు. వర రోజుల ముందే వచ్చిన వారికి భోజన వసతి సదుపాయాలు కలిపించారు. ప్రభుత్వం అన్ని శాఖల అధికారులు చేసిన ఏర్పాట్లతో ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా క్షణాల్లో ప్రసాదం వేయించుకుని వెళ్లేలా సమయం వృధా కాకుండా చేశారు. ఇక మత్యశాఖ అధికారులు ఉచితంగా చేపపిల్లలను అందజేశారు. పోలీసులు సైతం భారీ కట్టుదిట్టం చేయడమే కాకుండా మైదానంలో ప్రత్యేక అంబులెన్స్ లు ఏర్పాటు చేశారు. 
డ్రస్ కోడ్ పాటించిన వాలంటీర్స్..
గత ఏడాదితో పోలిస్తే ఈ సారి ఆస్తమా వ్యాధిగ్రస్తులు పెద్ద సంఖ్యలో చేపమందు కోసం బారులు తీరారు. ఈ సారి ప్రసాదం పంపిణీలో పాల్గొన్న స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు డ్రస్ కోడ్ పాటించి క్యూ లైన్ సక్రమంగా వెళ్లేలా, సుదూర ప్రాంతాల నుండి వచ్చిన వారికి సహాయసాకారాలు అందించారు.

Advertisement

Latest News

ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వం చాటుకున్న ఘటన
తిరుపతి జిల్లా, జూన్ 7: సూళ్లూరుపేట నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే నెలవల విజయ్ శ్రీ మానవత్వాన్ని చాటుకున్న ఉదంతం నాయుడుపేట వద్ద చోటుచేసుకుంది. గూడూరు నియోజకవర్గానికి చెందిన...
సూళ్లూరుపేటలో ఏరియా డామినేషన్ ప్రోగ్రాం
ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన
నాంపల్లి చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశ్రుతి – వృద్ధుడి మృతి
బోరబండను కాపాడాలి అంటూ మాగంటి ఇంటి వద్ద మహిళల ఆవేదన..
కంటతడి పెట్టుకున్న కేసిఆర్..
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో మొదలైన చేపప్రసాదం పంపిణీ..